సమంతని వెండితెరపై చూసి రెండేళ్లకు పైగానే గడిచిపోయాయి. 2023లో రెండు ఫ్లాపులు శాకుంతలం, ఖుషి పలకరించాక మళ్ళీ తన దర్శనం జరగలేదు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీలో కనిపించింది కానీ అదేమీ ఆశించిన మేజిక్ చేయలేకపోయింది. ఎప్పుడో కొన్ని నెలల క్రితం మా ఇంటి బంగారం అంటూ స్వంత ప్రాజెక్టు ప్రకటించాక కనీసం దాని డీటెయిల్స్ కూడా షేర్ చేసుకోలేదు. ఇదిలా ఉండగా సమంతా మహిళా దర్శకురాలు నందిని రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇన్స్ టాలో డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా పరస్పరం పంచుకున్న సందేశాలు చూస్తే అదే అనిపిస్తుంది.
త్వరలోనే కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు ఇద్దరూ మెసేజ్ చేసుకోవడం ఒక ప్రాజెక్టు వైపు అడుగులు పడుతున్న సంకేతాన్ని ఇస్తున్నాయి. సామ్ కున్న అతి దగ్గరి స్నేహితుల్లో నందిని రెడ్డి ఒకరు. ఈ కలయికలో మొదట జబర్దస్త్ వచ్చింది. సిద్దార్థ్ హీరోగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆడకపోవడం పక్కనపెడితే కోర్టు తీర్పు వల్ల అసలెక్కడ దొరకని పరిస్థితి తలెత్తింది. సమంత నటన గురించి అప్పట్లో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తర్వాత ఓ బేబీ కోసం చేతులు కలిపారు. ఇది ఘన విజయం సాధించింది. తర్వాత నందిని రెడ్డి తీసిన అన్నీ మంచి శకునములే ఫెయిల్యూర్ గా నిలిచింది.
సో అఫీషియల్ గా ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే కానీ మొత్తానికి మంచి కాంబోనే అవుతుంది. నిజానికి నందిని రెడ్డి టిల్లు స్క్వేర్ కన్నా ముందు సిద్ధూ జొన్నలగడ్డతో ఒక సినిమా ఓకే చేసుకున్నారు. కానీ ఏవేవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా సిద్దు వేరే దర్శకులకు కమిట్ మెంట్స్ ఇచ్చేసి ముందుకెళ్ళిపోగా నందినికి రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ టైంలోనే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేసుకున్నారని, సమంతాకు సూటయ్యేలా ఉండటంతో నిర్మాణం వైపు అడుగులు పడుతున్నట్టు సమాచారం. సో కొంచెం లేట్ అయినా సామ్ ని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ కావొచ్చు.
This post was last modified on March 5, 2025 11:39 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…