Trends

మహా కుంభమేళ : పడవలు నడిపి 30కోట్లు సంపాదించారు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ప్రకారం, ఈ ఉత్సవం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని.. ప్రధానంగా, కుంభమేళా వల్ల పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం, కుంభమేళా నిర్వహణకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయగా, దీని ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. హోటల్ పరిశ్రమలో రూ.40 వేల కోట్ల మేర ఆదాయం సమకూరగా, ఆహార మరియు నిత్యావసర వస్తువుల రంగంలో రూ.33 వేల కోట్లు వచ్చాయని తెలుస్తోంది. రవాణా రంగానికి కూడా భారీగా లాభం కలిగిందని, దాదాపు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ చాలా మంది ఆర్థికంగా లాభపడ్డారు. ముఖ్యంగా ఒక కుటుంబం 130 పడవలను నడిపించి రూ.30 కోట్ల మేర ఆదాయం సంపాదించిందని సీఎం యోగి ప్రకటించారు. ఒక్క పడవ ద్వారా రోజుకు రూ.52 వేల వరకు ఆదాయం రాగా, 45 రోజుల్లో ప్రతి పడవకు దాదాపు రూ.23 లక్షల వరకు లాభం వచ్చిందని వివరించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించినట్లుగా పడవ నడిపే వారు దోపిడీకి గురయ్యారనే వ్యాఖ్యలను సీఎం ఖండించారు. ప్రజల ఆదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, ఉత్సవం విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేశారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతో 45 రోజులపాటు జరిగిందని అన్నారు. ఇక కుంభమేళా దేశ జీడీపీ వృద్ధికి దోహదపడిన పెద్ద కార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధికి ఇది తోడ్పడుతుందని యోగి అభిప్రాయపడ్డారు.

This post was last modified on March 5, 2025 1:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago