Trends

మహా కుంభమేళ : పడవలు నడిపి 30కోట్లు సంపాదించారు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ప్రకారం, ఈ ఉత్సవం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని.. ప్రధానంగా, కుంభమేళా వల్ల పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం, కుంభమేళా నిర్వహణకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయగా, దీని ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. హోటల్ పరిశ్రమలో రూ.40 వేల కోట్ల మేర ఆదాయం సమకూరగా, ఆహార మరియు నిత్యావసర వస్తువుల రంగంలో రూ.33 వేల కోట్లు వచ్చాయని తెలుస్తోంది. రవాణా రంగానికి కూడా భారీగా లాభం కలిగిందని, దాదాపు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ చాలా మంది ఆర్థికంగా లాభపడ్డారు. ముఖ్యంగా ఒక కుటుంబం 130 పడవలను నడిపించి రూ.30 కోట్ల మేర ఆదాయం సంపాదించిందని సీఎం యోగి ప్రకటించారు. ఒక్క పడవ ద్వారా రోజుకు రూ.52 వేల వరకు ఆదాయం రాగా, 45 రోజుల్లో ప్రతి పడవకు దాదాపు రూ.23 లక్షల వరకు లాభం వచ్చిందని వివరించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించినట్లుగా పడవ నడిపే వారు దోపిడీకి గురయ్యారనే వ్యాఖ్యలను సీఎం ఖండించారు. ప్రజల ఆదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, ఉత్సవం విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేశారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతో 45 రోజులపాటు జరిగిందని అన్నారు. ఇక కుంభమేళా దేశ జీడీపీ వృద్ధికి దోహదపడిన పెద్ద కార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధికి ఇది తోడ్పడుతుందని యోగి అభిప్రాయపడ్డారు.

This post was last modified on March 5, 2025 1:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

42 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

56 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago