Trends

మహా కుంభమేళ : పడవలు నడిపి 30కోట్లు సంపాదించారు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ప్రకారం, ఈ ఉత్సవం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని.. ప్రధానంగా, కుంభమేళా వల్ల పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం, కుంభమేళా నిర్వహణకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయగా, దీని ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. హోటల్ పరిశ్రమలో రూ.40 వేల కోట్ల మేర ఆదాయం సమకూరగా, ఆహార మరియు నిత్యావసర వస్తువుల రంగంలో రూ.33 వేల కోట్లు వచ్చాయని తెలుస్తోంది. రవాణా రంగానికి కూడా భారీగా లాభం కలిగిందని, దాదాపు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ చాలా మంది ఆర్థికంగా లాభపడ్డారు. ముఖ్యంగా ఒక కుటుంబం 130 పడవలను నడిపించి రూ.30 కోట్ల మేర ఆదాయం సంపాదించిందని సీఎం యోగి ప్రకటించారు. ఒక్క పడవ ద్వారా రోజుకు రూ.52 వేల వరకు ఆదాయం రాగా, 45 రోజుల్లో ప్రతి పడవకు దాదాపు రూ.23 లక్షల వరకు లాభం వచ్చిందని వివరించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించినట్లుగా పడవ నడిపే వారు దోపిడీకి గురయ్యారనే వ్యాఖ్యలను సీఎం ఖండించారు. ప్రజల ఆదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, ఉత్సవం విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేశారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతో 45 రోజులపాటు జరిగిందని అన్నారు. ఇక కుంభమేళా దేశ జీడీపీ వృద్ధికి దోహదపడిన పెద్ద కార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధికి ఇది తోడ్పడుతుందని యోగి అభిప్రాయపడ్డారు.

Kumar

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

51 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

6 hours ago