ఏపీలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? అక్కడ మాదిగలకు ద్రోహం చేయడం లేదా? అని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ సమావేశం సందర్భంగా రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, ఆయన వల్లే మూసీ, మెట్రో ప్రాజెక్టులు ఆగిపోయాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలను కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఇల్లు మంజూరు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోతారని కులగణనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు తెలంగాణ కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పనుల్లో పావలా శాతం కూడా రాష్ట్రానికి రావడంలేదని ఆరోపించారు.
టీపీసీసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మంచి విషయం మైక్ లో చెప్పాలని, చెడు విషయం చెవిలో చెప్పాలని రేవంత్ అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మరో విడతలో తప్పకుండా పదవులు వస్తాయని చెప్పారు. అదే విధంగా కష్టపడని వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.
This post was last modified on March 1, 2025 7:11 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…