Political News

ఏపీలో ఆ రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: రేవంత్ రెడ్డి

ఏపీలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? అక్కడ మాదిగలకు ద్రోహం చేయడం లేదా? అని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ సమావేశం సందర్భంగా రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, ఆయన వల్లే మూసీ, మెట్రో ప్రాజెక్టులు ఆగిపోయాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలను కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఇల్లు మంజూరు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోతారని కులగణనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు తెలంగాణ కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పనుల్లో పావలా శాతం కూడా రాష్ట్రానికి రావడంలేదని ఆరోపించారు.

టీపీసీసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మంచి విషయం మైక్ లో చెప్పాలని, చెడు విషయం చెవిలో చెప్పాలని రేవంత్ అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మరో విడతలో తప్పకుండా పదవులు వస్తాయని చెప్పారు. అదే విధంగా కష్టపడని వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.

This post was last modified on March 1, 2025 7:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వ్యాపార సంస్క‌ర్త‌-2025’: చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

19 seconds ago

కొడాలి రీప్లేస్.. ఖాయమంటున్న కేడర్..!

కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…

18 minutes ago

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

51 minutes ago

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

2 hours ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

2 hours ago

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

2 hours ago