ఏపీలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? అక్కడ మాదిగలకు ద్రోహం చేయడం లేదా? అని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ సమావేశం సందర్భంగా రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, ఆయన వల్లే మూసీ, మెట్రో ప్రాజెక్టులు ఆగిపోయాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలను కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఇల్లు మంజూరు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోతారని కులగణనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు తెలంగాణ కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పనుల్లో పావలా శాతం కూడా రాష్ట్రానికి రావడంలేదని ఆరోపించారు.
టీపీసీసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మంచి విషయం మైక్ లో చెప్పాలని, చెడు విషయం చెవిలో చెప్పాలని రేవంత్ అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మరో విడతలో తప్పకుండా పదవులు వస్తాయని చెప్పారు. అదే విధంగా కష్టపడని వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.
This post was last modified on March 1, 2025 7:11 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…