నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆసాంతం చదివేశారు. రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లను చవిచూశారు. అందివచ్చిన విజయాలతో పాటుగా ఎదురు వచ్చిన ప్రతి ప్రతిబంధకాన్ని కూడా ఆయన క్షుణ్ణంగానే చదవేశారు. లేకుంటే… విడతల వారీగా ఓ సారి గెలుపు… ఓ సారి ఓటమి ఎలా సాధ్యపడతాయి? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రబాబు విజయాల బాట పట్టారు. ఈ క్రమంలోనే 2019లో తనకు ఎదురైన ఓటమి నేపథ్యంలో… జగన్ మనస్తత్వాన్ని బాబు క్షుణ్ణంగా చదివారు. దానికి విరుగుడు కనిపట్టేసి 2024లో తిరిగి అధికారంలోకి వచ్చేశారు.
ఇదంతా నిజమా? అంటే… అక్షరాలా నిజమండి బాబూ. ఎందుకంటే… ఈ విషయాన్ని వేరే ఎవరో చెప్పలేదు. స్వయంగా చంద్రబాబే పూసగుచ్చినట్టుగా వివరించారు. తన పార్టీ నేతలకు జగన్ గురించి వివరించారు. జగన్ తో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తర్వాత టీడీఎల్పీ భేటీని నిర్వహించిన చంద్రబాబు… పార్టీ తరఫున కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టిన వారికి చాలా జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగానే జగన్ గుణగణాలను. ఆయనలోని ప్రత్యేకతలు, నైపుణ్యాలను చంద్రబాబు విడమరిచి మరీ వివరించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా జగన్ నుంచి ముప్పు తప్పదని కూడా చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా జగన్ గురించి చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే… ”జగన్ తో జాగ్రత్తగా ఉండాలి. జగన్ కుట్రల వల్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, విశాఖలో తనపై జరిగిన కోడికత్తి డ్రామాల నెపాన్ని జగన్ మనపై వేశారు. జగన్ గురించి నాడు మనకు పెద్దగా తెలియదు కాబట్టి.. ఆనాడు మనం అప్రమత్తంగా ఉండలేకయాం. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయాం. జగన్ కుట్రలను నాటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పసిగట్టలేకపోయింది. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్ర కోణం ఉంది. అందుకే సీసీటీవీ ఫుటేజీలు అడిగినా వారు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నేతలంతా జగన్ తో అప్రమత్తంగా ఉండాలి” అని చంద్రబాబు అన్నారు. ఈ లెక్కన జగన్ గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పొచ్చు.
This post was last modified on March 1, 2025 7:18 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…