మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఆయన సినిమాలు ఒరిజినల్ వెర్షన్ తో పాటు అదే తేదీకి తెలుగులో కూడా థియేటర్ రిలీజ్ జరుపుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ఐ నో బడి. ఇదే టైటిల్ తో ఇక్కడ ప్రచారం చేశారు కానీ స్క్రీన్ మీద మాత్రం ఐ ఎవరూ లేరు అని రావడం అసలు ట్విస్టు. ప్రమోషన్ల కోసం పృథ్విరాజ్ హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఒక రోజు ఆలస్యంగా ఏపీ తెలంగాణలో విడుదలైన ఐ నో బడికి ఓపెనింగ్స్ రాలేదు. అంతా లెనిన్ మయం కావడంతో బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాల గురించి చర్చ కానీ హైప్ కానీ కనిపించడం లేదు. భారీ దొంగతనం కేసులో ఇరుక్కున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి దాన్నుంచి బయట పడే క్రమంలో ఎదురుకున్న సమస్యలు, ప్రమాదాలే ప్రధానాంశంగా దర్శకుడు నిషం బషీర్ దీన్ని రూపొందించారు. ఫస్ట్ హాఫ్ మంచి రిపోర్ట్స్ తెచ్చుకోగా సెకండాఫ్ మీద మిశ్రమ స్పందన దక్కించుకుంది.
చూస్తుంటే పోటీ తాకిడిలో ఏ మేరకు నిలుస్తుందనేది అనుమానంగానే ఉందని ట్రేడ్ టాక్. అసలిది రిలీజైన విషయమే జనాలకు తెలియనంత వీక్ గా పబ్లిసిటీ చేశారు. అందుకే బిసి సెంటర్లలో కొన్ని చోట్ల అసలు షో పడకుండానే క్యాన్సిల్ అయ్యాయి. కారణం పబ్లిక్ కనీస స్థాయిలో రాకపోవడమే. లెనిన్ తర్వాత విచిత్రంగా క్రౌడ్స్ ని అంతో ఇంతో లాగుతుంది ఇంగ్లీష్ డబ్బింగ్ ఈవిల్ డెడ్ బర్న్ కావడం గమనార్షం. పృథ్విరాజ్ ని లైట్ తీసుకున్నారు కాబోలు.
వారణాసిలో విలన్ గా నటిస్తున్న పృథ్విరాజ్ క్రమంగా తెలుగు మార్కెట్ ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ వర్కౌట్ కావడం లేదు. మోహన్ లాల్, మమ్ముట్టిల వల్లే కానిది తను ట్రై చేయాలనుకోవడం తప్పేం కాదు. కానీ మన ఆడియన్స్ అభిరుచులకు మల్లువుడ్ కంటెంట్ ఓటిటిలో చూసేందుకు బాగుంటుంది కానీ డబ్బులిచ్చి థియేటర్లలో చూసేందుకు కాదు. మరో డబ్బింగ్ మూవీ హృదయం మురళికి కొంచెం బెటర్ రెస్పాన్స్ రావడం నో బడికి ఇబ్బందిగా మారనుంది.
This post was last modified on July 13, 2026 6:03 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…