టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగి తోపులాట కూడా తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ ఫెడరేషన్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉంది. ఆమె వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
కార్యవర్గం, సభ్యుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫెడరేషన్కు ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత నిర్ణయించడం సమస్యకు దారి తీసింది. సుమలత తీరుపై నిరసనగా పది మంది డ్యాన్సర్లు సమాఖ్యకు రాజీనామా చేశారట.
ఎన్నికలు నిర్వహించడాన్ని జానీ వర్గం సమర్థిస్తుండగా.. శేఖర్ మాస్టర్ వర్గం వ్యతిరేకించింది. దీనిపై ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదించుకోవడం.. జానీ, శేఖర్ ఒకరి మీదికి ఒకరు వెళ్తూ మాటలు అనుకోవడం.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
టాలీవుడ్లో గత దశాబ్ద కాలంగా శేఖర్, జానీ మాస్టర్లే టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. దాదాపుగా పెద్ద సినిమాలన్నీ వీళ్లిద్దరే చేస్తున్నారు. జానీ ఒక కేసులో చిక్కుకున్న టైంలో శేఖర్ హవా సాగింది కానీ.. తర్వాత జానీ మళ్లీ కొరియోగ్రాఫర్గా బిజీ అయ్యాడు. ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ కొరియోగ్రఫీకి మంచి పేరొచ్చింది.
This post was last modified on July 12, 2026 9:04 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…