టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగి తోపులాట కూడా తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ ఫెడరేషన్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉంది. ఆమె వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
కార్యవర్గం, సభ్యుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫెడరేషన్కు ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత నిర్ణయించడం సమస్యకు దారి తీసింది. సుమలత తీరుపై నిరసనగా పది మంది డ్యాన్సర్లు సమాఖ్యకు రాజీనామా చేశారట.
ఎన్నికలు నిర్వహించడాన్ని జానీ వర్గం సమర్థిస్తుండగా.. శేఖర్ మాస్టర్ వర్గం వ్యతిరేకించింది. దీనిపై ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదించుకోవడం.. జానీ, శేఖర్ ఒకరి మీదికి ఒకరు వెళ్తూ మాటలు అనుకోవడం.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
టాలీవుడ్లో గత దశాబ్ద కాలంగా శేఖర్, జానీ మాస్టర్లే టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. దాదాపుగా పెద్ద సినిమాలన్నీ వీళ్లిద్దరే చేస్తున్నారు. జానీ ఒక కేసులో చిక్కుకున్న టైంలో శేఖర్ హవా సాగింది కానీ.. తర్వాత జానీ మళ్లీ కొరియోగ్రాఫర్గా బిజీ అయ్యాడు. ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ కొరియోగ్రఫీకి మంచి పేరొచ్చింది.
This post was last modified on July 12, 2026 9:04 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…