టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగి తోపులాట కూడా తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ ఫెడరేషన్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉంది. ఆమె వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
కార్యవర్గం, సభ్యుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫెడరేషన్కు ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత నిర్ణయించడం సమస్యకు దారి తీసింది. సుమలత తీరుపై నిరసనగా పది మంది డ్యాన్సర్లు సమాఖ్యకు రాజీనామా చేశారట.
ఎన్నికలు నిర్వహించడాన్ని జానీ వర్గం సమర్థిస్తుండగా.. శేఖర్ మాస్టర్ వర్గం వ్యతిరేకించింది. దీనిపై ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదించుకోవడం.. జానీ, శేఖర్ ఒకరి మీదికి ఒకరు వెళ్తూ మాటలు అనుకోవడం.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
టాలీవుడ్లో గత దశాబ్ద కాలంగా శేఖర్, జానీ మాస్టర్లే టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. దాదాపుగా పెద్ద సినిమాలన్నీ వీళ్లిద్దరే చేస్తున్నారు. జానీ ఒక కేసులో చిక్కుకున్న టైంలో శేఖర్ హవా సాగింది కానీ.. తర్వాత జానీ మళ్లీ కొరియోగ్రాఫర్గా బిజీ అయ్యాడు. ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ కొరియోగ్రఫీకి మంచి పేరొచ్చింది.
This post was last modified on July 12, 2026 9:04 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…