రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో కూటమి ప్రభుత్వానికి సూచనలు చేసిన సందర్భాల్లోనూ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా ఉపా చట్టం (యూఏపీఏ) వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఏబీవీ, ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఆ వేదికపై అంబటి రాంబాబు ఏమి మాట్లాడారో తాను వినలేదని, ఆయన పక్కన కూర్చున్నాననే కారణంతో సభ మధ్యలో లేచి వెళ్లిపోవడం సభా మర్యాద కాదని చెప్పారు.
“మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను సంస్కారం వదిలేయాలా? మీరు నా గురించి పొరబడ్డారు. నేనలాంటి వాడిని కాదు” అంటూ ఏబీవీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించాలనుకుంటుందా? అని ప్రశ్నించారు.
ఇంతకుముందు అమరావతి భూసేకరణ అంశంపైనా ఏబీవీ స్పందించారు. రెండో విడతలో వేలాది ఎకరాల భూమిని సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కష్టమవుతుందని హెచ్చరించారు. అలాగే అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయకపోతే కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు.
అలాగే జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని సూచించారు. యూట్యూబ్ వ్యాఖ్యలపై ఉపా చట్టాన్ని ప్రయోగించే విషయంలో రాజద్రోహం కేసు అవసరం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో కూటమి కార్యకర్తల నుంచి విమర్శలు రావడంతో, తాను చేస్తున్న వ్యాఖ్యలను సద్విమర్శలుగా స్వీకరించాలని ఏబీవీ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస పోస్టులు చేస్తూ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
This post was last modified on July 13, 2026 8:55 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…