వైసీపీ అధినేత జగన్.. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై కేసు పెట్టి సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదిరించి, కిడ్నాప్ చేసి.. కేసును వెనక్కి తీసుకునేలా చేశారన్న అభియోగంపై ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో వంశీ ఉన్నారు. వంశీని పరామర్శించిన అనంతరం.. జగన్ మాట్లాడుతూ.. అసలు ఆ టీడీపీ కార్యాలయం కేసుకు, వంశీకి సంబందం లేదని చెప్పారు. అంతేకాదు.. టీడీపీ నాయకుడు పట్టాభి రాం రెచ్చగొట్టడం వల్లే.. ఆ దాడి జరిగిందన్నారు.
ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుల ప్రమేయం అసలు లేనేలేదని జగన్ చెప్పారు. అయితే.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. `ఫేక్-రియల్` అంటూ.. ఓ వీడియోను విడుదల చేశారు. దీనిలో జగన్ చేసిన వ్యాఖ్యలు.. దాని పక్కనే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి.. నాడు వాహనాలు తగల బడుతున్న దృశ్యాలను పేర్కొన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు.. జరిగిన ఘటనకు ఏమాత్రం పొంతన లేదని నారా లోకేష్ సాక్ష్యాధారాలతో సహా వివరించారు.
“నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు `మీ బ్రాండ్` జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది“ అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
This post was last modified on February 18, 2025 9:10 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…