Political News

జ‌గ‌న్ `ఇమేజ్‌` పైనా డౌటే..!

“నావ‌ల్లే మీరంతా గెలిచారు. న‌న్ను చూసే ప్ర‌జ‌లు మీకు ఓట్లేశారు“ అంటూ.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లు మార్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త‌న పాల‌న స‌మ‌యంలో నూ.. ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. త‌నను చూసే.. ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను ఆద‌రిస్థున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. దీంతో సీనియ‌ర్లు.. సీనియ‌ర్ మోస్టులు ఒకింత ఆవేద‌న చెందారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం త‌న పంథాను మార్చుకోలేక పోయారు.

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ `నేనే` అనే కాన్సెప్టును మ‌రింత తీవ్రం చేశారు. స‌ర్వం జ‌గ‌న్నా థం అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు అందిన స‌ర్వేల ఆధారంగా.. అంటూ.. కీల‌క నేత‌ల‌ను బ‌రి నుంచి త‌ప్పించారు. అంతేకాదు.. త‌న‌కు న‌చ్చిన.. తాను మెచ్చిన వారిని తీసుకువ చ్చి నియోజ‌క‌వ‌ర్గాల‌ను అప్ప‌గించారు. ఇంకేముంది.. త‌న ఇమేజ్‌.. త‌న ఫొటోతోనే అంద‌రూ గెలిచేస్తార‌ని కూడా చెప్పుకొచ్చారు.

కానీ.. ఈ వ్యూహం బెడిసి కొట్టింది. 151 స్థానాల నుంచి 11 స్థానాల‌కు వైసీపీ ప‌డిపోయింది. అయితే.. ఈ స‌మ‌యంలోనూ జ‌గ‌న్ ఇమేజ్ వ్య‌వ‌హారం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినా.. కూట‌మి చేసిన మంత్రాంగంతోనే.. తాము ఓడిపోయామ‌ని వైసీపీ నాయ‌కులు స‌మ‌ర్థించుకున్నారు. దీనిలో జ‌గ‌న్ పాత్ర‌లేద‌న్నారు. ఇక‌, కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మార‌ని అందుకే.. వారికి అవ‌కాశం ఇచ్చార‌ని కూడా నాయ‌కులు వ్యాఖ్యానించారు.

క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ ఇమేజ్ ఏమైనా పెరిగిందా? అంటే.. లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికి ఎన్నిక‌లు పూర్త‌యి 9 మాసాలు జ‌రిగినా.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఇమేజ్ పెరిగిన దాఖ‌లా అయితే క‌నిపించ‌డం లేదు. పైగా.. జ‌గ‌న్ పిలుపునిస్తున్నా.. ఉద్య‌మాలు, నిర‌స‌న‌ల‌కు రావాల‌ని కోరుతున్నా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు . ఈ ప‌రిణామాల‌తో.,. జ‌గ‌న్ ఇమేజ్ డీలా ప‌డిన‌ట్టేన‌ని కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు.

అయితే.. వైసీపీలోని జ‌గ‌న్ అభిమానులు మాత్రం మ‌రో విధంగా చ‌ర్చిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఆలోచ‌న చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే త‌మ నాయ‌కుడి విష‌యంలో పాజిటివిటీ పెరుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 18, 2025 1:57 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

34 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

50 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago