Political News

ఇదేం గోల?.. ఈ గోలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు?

వైసీపీ శ్రేణుల నినాదాల హోరుతో మంగళవారం విజయవాడలోని జైలు ప్రాంగణం మారుమోగిపోయింది. అసలే అది జిల్లా జైలు ప్రాంగణం… అందులోనూ తమ పార్టీకి చెందిన ఓ కీలక నేత అరెస్టైతే… ఆయనను పరామర్శించేందుకు ఏకంగా పార్టీ అధినేతే అక్కడకు తరలివచ్చారు. అలాంటి సమయంలో పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలి కదా. మంగళవారం విజయవాడ జైలు పరిసరాల్లో అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. ఒకటే అరుపులు. కేకలు. మిన్నంటే నినాదాలు. ఒకరు జై జగన్ అంటే.. మరొకరు సీఎం జగన్ అని… సీఎం సీఎం అంటూ పిచ్చి పట్టిన వారికి మల్లే ఒకటే గోల. ఈ గోల తట్టుకోవడం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగానే అలవాటు అయినట్టుంది గానీ… వైసీపీ నేతలైన పేర్ని నాని, కొడాలి నాని లాంటి వారికి ఇంకా అలవాటు కానట్టుంది. నానిలిద్దరూ నినాదాలు ఆపాలంటూ సైగలు చేస్తున్నా… పార్టీ శ్రేణులు ఇసుమంత కూడా పట్టించుకోలేదు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ కు బెదిరింపులు, కిడ్నాప్ లకు సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టైన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వంశీని పోలీసులు విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న వంశీని కలిసేందుకు మంగళవారం జగన్ వచ్చారు. జైలు అధికారుల అనుమతితో ఆయన వంశీతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు ప్రాంగణంలోనే మీడియాను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వంశీ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు, ఈ వ్యవహారంలో వంశీకి జరిగిన అన్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నినాదాలతో జైలు పరిసరాలను హోరెత్తించాయి.

వంశీకి జరిగిన అన్యాయంపై జగన్ చెబుతున్న వివరాలు ఎక్కడ జనానికి చేరకుండాపోతాయేమోనని ఓ వైపు పేర్ని, కొడాలిలతో పాటుగా వంశీ సతీమణి పంకజశ్రీ కూడా నినాదాలు ఆపాలంటూ పదే పదే పార్టీ శ్రేణులకు చెప్పే యత్నం చేశాయి. ఈ క్రమంలో చేతులు ఊపుతూ నినాదాలు ఆపేయాలంటూ వార సైగలు చేశారు. అయితే వారి సైగలను పట్టించుకున్న వారే కనిపించలేదు. చేతులు ఊపి ఊపి ఇక లాభం లేదని భావించిన నేతలు.. పార్టీ శ్రేణులను నిలువరించే యత్నాలను ఆపేశారు. ఇంతగా నినాదాలు హోరెత్తుతున్నా కూడా జగన్ ఏమాత్రం తొట్రుపాటుకు గురి కాకుండానే మీడియాతో మాట్లాడారు. జగన్ లో కనిపించిన ఈ వైఖరిని చూసి… పార్టీ శ్రేణుల నినాదాలు ఆయనకు నచ్చి ఉంటాయిలే అని కొందరు.. జగన్ లో ఆ స్లోగన్ లు ఊపును పెంచి ఉంటాయిలే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on February 18, 2025 3:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

4 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

4 hours ago

మందుబాబులకు షాకిచ్చిన విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…

4 hours ago