కారణం ఏదైనా ఒక చిన్న సినిమా విడుదల వాయిదా పడిందంటే దానికి మళ్ళీ సరైన డేట్ ని వెతుక్కోవడం నిర్మాతలకు కంటి మీద కునుకు రానంత సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం సారంగపాణి జాతకం పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 20 లాక్ చేసుకుని ఆ మేరకు కొన్నిరోజులు ప్రమోషన్లు చేసుకున్నారు. పుష్ప 2 జోరు విపరీతంగా ఉండటం, నితిన్ రాబిన్ హుడ్ అదే తేదీకి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో సారంగపాణి టీమ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
తీరా చూస్తే ఇప్పుడదే సమస్యయ్యింది. స్లాట్లన్నీ బుక్ అయిపోతున్నాయి. ఫిబ్రవరిలో తెద్దామంటే అదంతా సేఫ్ సీజన్ కాదని వెనుకడుగు వేశారు. ఎలాగూ తండేల్ ఉంది కదా దానికి ఎదురెళ్ళడం ఎందుకని ఆగారు. ప్రేమికుల రోజున లైలా, బ్రహ్మ ఆనందం ఉన్నాయి. తొలుత దిల్ రుబా కూడా ఉండేది కానీ తర్వాత తప్పుకుంది. ఇప్పుడు మజాకాతో మంత్ ఎండింగ్ ముగిసిపోనుంది. పోనీ మార్చి మొదటి వారం చూద్దామా అంటే ఓటిటి డీల్ కు సంబంధించి ఏదో వ్యవహారం పెండింగ్ ఉందట. ఇది త్వరగా తేలకపోతే ఇంకొంత ఆలస్యం తప్పదు. మార్చి నెలాఖరులో తీవ్రమైన పోటీ ఉంది.
అలాని సారంగపాణి జాతకం ఏదో ఆషామాషీ క్యాస్టింగ్ తో తీసింది కాదు. టైటిల్ రోల్ ప్రియదర్శి పోషించాడు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ తారాగణం ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందించగా టాప్ కెమెరామెన్ పిజి విందా ఛాయాగ్రహణం సమకూర్చారు. ఇంద్రగంటి గత కొన్ని సినిమాలు ఫ్లాప్ ఏమో కానీ ఇంతకు ముందు అష్టాచెమ్మా, జెంటిల్ మెన్, గోల్కొండ హైస్కూల్, సమ్మోహనం లాంటి ఫ్యామిలీ సెక్షన్ ఫేవరెట్స్ చాలా ఉన్నాయి. పైగా సారంగపాణి నిర్మాత శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్. మరి జాతకం ఎప్పుడు సెట్టై ఇది బయటికి వస్తుందో.
This post was last modified on February 18, 2025 7:39 pm
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…