సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు ముందు చాలా మంది వివాదాస్పద దర్శకుడు అంటూ రాస్తూ ఉంటారు. తన పనేదో తానూ చేసుకుపోతున్న వర్మను ఇలా వివాదాస్పద దర్శకుడు అని రాయాల్సిన అవసరం ఏముందని అడిగే వారికి ఇప్పుడు సిసలైన సమాధానం దొరికిందని చెప్పాలి. అసలే పోలీసులు… ఆపై విచారణ పేరిట నోటీసుల మీద నోటీసులు. వాటికి స్పందించాలంటేనే వణికిపోయిన వర్మ.. ఆ విదారణకు ఒక్కసారి హాజరు కాగానే.. తనలోని భయం మొత్తం పోయినట్టే ఉంది. అందుకే కాబోలు విచారణ ముగిసిన వెంటనే… వర్మ మందు గ్లాస్ చేతిలో పెట్టుకుని మరీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి పోలీసులపైనే పోస్టులు పెట్టారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా… వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకర కామెంట్లు పెట్టిన కేసులో గత శుక్రవారం వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విదారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పోలీసులు ఏకంగా 9 గంటల పాటు వర్మను విచారించారు. పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వర్మా.. సుదీర్ఘ విచారణ తర్వాత బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వైసీపీ నేతల వద్దకు వెళ్లిన వర్మ… ఆ రాత్రి ఒంగోలు లోనే ఉన్నట్టు సమాచారం. ఈ సందర్బంగా వర్మ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టే ఉన్నారు.
సరే.. తన డబ్బు..తన ఎంజాయ్… ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు గాని… చేతిలో మందు గ్లాస్ పట్టుకుని… ఓ సెల్ఫీ తీసుకుని… దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి…దానికి ఓ కామెంట్ కూడా పెట్టారు. ”ఐ లవ్ ఒంగోలు.. అండ్ ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్.. త్రీ చీర్స్” అంటూ వర్మ సదరు కామెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలే పోలీసు విచారణ అంటే ముందస్తు బెయిల్ వచ్చే దాకా హడలిపోయిన వర్మ,… ఇలా విచారణ ముగిసిందో, లేదో పోలీసులనే కామెంట్ చేస్తూ పోస్టు పెట్టడం గమనార్హం. అసలు వర్మ పెట్టిన ఈ పోస్టును ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 9, 2025 11:22 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…