సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు ముందు చాలా మంది వివాదాస్పద దర్శకుడు అంటూ రాస్తూ ఉంటారు. తన పనేదో తానూ చేసుకుపోతున్న వర్మను ఇలా వివాదాస్పద దర్శకుడు అని రాయాల్సిన అవసరం ఏముందని అడిగే వారికి ఇప్పుడు సిసలైన సమాధానం దొరికిందని చెప్పాలి. అసలే పోలీసులు… ఆపై విచారణ పేరిట నోటీసుల మీద నోటీసులు. వాటికి స్పందించాలంటేనే వణికిపోయిన వర్మ.. ఆ విదారణకు ఒక్కసారి హాజరు కాగానే.. తనలోని భయం మొత్తం పోయినట్టే ఉంది. అందుకే కాబోలు విచారణ ముగిసిన వెంటనే… వర్మ మందు గ్లాస్ చేతిలో పెట్టుకుని మరీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి పోలీసులపైనే పోస్టులు పెట్టారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా… వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకర కామెంట్లు పెట్టిన కేసులో గత శుక్రవారం వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విదారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పోలీసులు ఏకంగా 9 గంటల పాటు వర్మను విచారించారు. పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వర్మా.. సుదీర్ఘ విచారణ తర్వాత బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వైసీపీ నేతల వద్దకు వెళ్లిన వర్మ… ఆ రాత్రి ఒంగోలు లోనే ఉన్నట్టు సమాచారం. ఈ సందర్బంగా వర్మ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టే ఉన్నారు.
సరే.. తన డబ్బు..తన ఎంజాయ్… ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు గాని… చేతిలో మందు గ్లాస్ పట్టుకుని… ఓ సెల్ఫీ తీసుకుని… దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి…దానికి ఓ కామెంట్ కూడా పెట్టారు. ”ఐ లవ్ ఒంగోలు.. అండ్ ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్.. త్రీ చీర్స్” అంటూ వర్మ సదరు కామెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలే పోలీసు విచారణ అంటే ముందస్తు బెయిల్ వచ్చే దాకా హడలిపోయిన వర్మ,… ఇలా విచారణ ముగిసిందో, లేదో పోలీసులనే కామెంట్ చేస్తూ పోస్టు పెట్టడం గమనార్హం. అసలు వర్మ పెట్టిన ఈ పోస్టును ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 9, 2025 11:22 am
కలసి ఉంటే కలదు సుఖం.. అన్నట్టుగా కూటమిగా ఢిల్లీలో నిలబడి ఉంటే.. ఇండియా కూటమి ఘన విజయం దక్కించుకునేది.. అనేందుకు…
రెండు నెలల కిందట విడుదలైన ‘పుష్ప-2’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.…
పెళ్లిళ్లు జరగడం.. జరగకపోవడం అనేది కామనే. కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిళ్ల కంటే కూడా.. రద్దవుతున్న పెళ్లిళ్ల వ్యవహారాలు…
ప్రధాని నరేంద్ర మోడీకి ఈ శనివారం అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకంటే… పదేళ్లకు పైబడి ఢిల్లీ సీఎం సీటును చేజిక్కించుకునేందుకు…
ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ఏదీ జరగలేదనే…
భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే…