వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా మన్మథుడుకుండే క్రేజ్ వేరే. అందుకే రీ రిలీజ్ టైంలో ఇది మసాలా సినిమా కాకపోయినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ ఎంజాయ్ చేశారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం, త్రివిక్రమ్ మాటలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ సోనాలి బెంద్రేనే అయినా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్షు చాలా కీలకం. నాగార్జునని ప్రేమించి యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయే క్యారెక్టర్ లో కనిపించే కాసేపు రెండు పాటల్లో అలా గుర్తుండిపోయింది. తర్వాత ప్రభాస్ రాఘవేంద్రలో నటించింది కానీ అది డిజాస్టర్ అయ్యాక భూమిక మిస్సమ్మలో క్యామియో తప్ప మళ్ళీ ఎక్కడ కనిపించలేదు.
ఇప్పుడు మజాకాతో అన్షు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలు ఏమైందనే ప్రశ్నకు సమాధానాలు చెబుతోంది. అన్షు సినిమాలు చేసే నాటికీ ఆమె వయసు 16 ఏళ్ళు. చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చిన ఆఫర్లు వదులుకుని లండన్ వెళ్ళిపోయింది. సైకాలజీలో మాస్టర్ చేసింది. పాతికేళ్లకే పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఏదైనా ఏజెన్సీలో పని చేద్దామని ప్రయత్నిస్తే అన్షు నటించిన సినిమాలు తమకు తెలియవని చెప్పి తిరస్కరించారు. తిరిగి ఇంత కాలం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన మజాకాని రెండు గంటలసేపు నెరేట్ చేశాక అవకాశాన్ని వదులుకోవాలి అనిపించలేదు.
మన్మథుడు కోసం పదమూడు రోజులు కాల్ షీట్స్ ఇచ్చిన అన్షు మజాకాకు రెండు నెలలు కేటాయించింది. రావు రమేష్ ప్రేమించే మధ్య వయసు మహిళగా కొత్త తరహా పాత్రలో కనిపించనుంది. ఇంత వయసు వచ్చినా అదే అందంతో తొణికిసలాడుతున్న అన్షు ఇకపై కెరీర్ కొనసాగిస్తానని చెబుతోంది. సెట్స్ లో అడుగుపెట్టినప్పుడు ఒత్తిడిగా అనిపించిందని ఇప్పుడది తగ్గిపోయిందని చెబుతున్న అన్షుకి ఇది హిట్ కావడం కీలకం. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా రిలీజవుతోంది. నవ్వించడమే లక్ష్యంగా ధమాకాని మించిన ఎంటర్ టైన్మెంట్ త్రినాథరావు ఇందులో పొందుపరిచారట.
This post was last modified on February 9, 2025 11:36 am
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…