Movie News

మన్మథుడు భామ అందుకే కనిపించలేదు

వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా మన్మథుడుకుండే క్రేజ్ వేరే. అందుకే రీ రిలీజ్ టైంలో ఇది మసాలా సినిమా కాకపోయినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ ఎంజాయ్ చేశారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం, త్రివిక్రమ్ మాటలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ సోనాలి బెంద్రేనే అయినా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్షు చాలా కీలకం. నాగార్జునని ప్రేమించి యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయే క్యారెక్టర్ లో కనిపించే కాసేపు రెండు పాటల్లో అలా గుర్తుండిపోయింది. తర్వాత ప్రభాస్ రాఘవేంద్రలో నటించింది కానీ అది డిజాస్టర్ అయ్యాక భూమిక మిస్సమ్మలో క్యామియో తప్ప మళ్ళీ ఎక్కడ కనిపించలేదు.

ఇప్పుడు మజాకాతో అన్షు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలు ఏమైందనే ప్రశ్నకు సమాధానాలు చెబుతోంది. అన్షు సినిమాలు చేసే నాటికీ ఆమె వయసు 16 ఏళ్ళు. చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చిన ఆఫర్లు వదులుకుని లండన్ వెళ్ళిపోయింది. సైకాలజీలో మాస్టర్ చేసింది. పాతికేళ్లకే పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఏదైనా ఏజెన్సీలో పని చేద్దామని ప్రయత్నిస్తే అన్షు నటించిన సినిమాలు తమకు తెలియవని చెప్పి తిరస్కరించారు. తిరిగి ఇంత కాలం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన మజాకాని రెండు గంటలసేపు నెరేట్ చేశాక అవకాశాన్ని వదులుకోవాలి అనిపించలేదు.

మన్మథుడు కోసం పదమూడు రోజులు కాల్ షీట్స్ ఇచ్చిన అన్షు మజాకాకు రెండు నెలలు కేటాయించింది. రావు రమేష్ ప్రేమించే మధ్య వయసు మహిళగా కొత్త తరహా పాత్రలో కనిపించనుంది. ఇంత వయసు వచ్చినా అదే అందంతో తొణికిసలాడుతున్న అన్షు ఇకపై కెరీర్ కొనసాగిస్తానని చెబుతోంది. సెట్స్ లో అడుగుపెట్టినప్పుడు ఒత్తిడిగా అనిపించిందని ఇప్పుడది తగ్గిపోయిందని చెబుతున్న అన్షుకి ఇది హిట్ కావడం కీలకం. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా రిలీజవుతోంది. నవ్వించడమే లక్ష్యంగా ధమాకాని మించిన ఎంటర్ టైన్మెంట్ త్రినాథరావు ఇందులో పొందుపరిచారట.

This post was last modified on February 9, 2025 11:36 am

Share
Show comments
Published by
Satya
Tags: Anshumajaka

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

33 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago