Political News

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ స‌మీపంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఆయ‌న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చ‌ర్చించారు. ఇదేస‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌తోనూ మాట్లాడారు. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి మెలిసి ఉండాల‌ని సూచించారు. కానీ, ఈ విష‌యం ఇంకా బీజేపీ నాయ‌కుల‌కు ఒంట‌బట్టిన‌ట్టు లేద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మంత్రి వ‌ర్గంలోకి బీజేపీని కూడా తీసుకున్నారు. ధ‌ర్మ‌వరం ఎమ్మెల్యే స‌త్య‌కుమార్‌కు వైద్య శాఖ అప్ప‌గించారు. అయితే.. త‌మ‌కు మ‌రో ప‌ద‌వి కూడా కావాల‌న్న‌ది స్థానిక బీజేపీ నేత‌ల ప‌ట్టు. దీనిపై కేంద్రం స్థాయిలో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే.. త‌మ అవ‌స‌రాలు వేరే ఉన్న నేప‌థ్యంలో కూట‌మి పార్టీల‌తో క‌లిసి పోవాల‌ని బీజేపీ పెద్ద‌లు రాష్ట్ర స్థాయి నేత‌ల‌కు సూచించారు. వివాదాల‌కు తావివ్వ‌కుండా ముందుకు సాగాల‌ని కూడా సూచించారు.

దీనికి తొలుత ఓకే చెప్పిన క‌మ‌ల నాథులు.. త‌ర్వాత మాత్రం త‌మ పంథాలో తామే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు దూరం పాటిస్తున్నార‌న్న వాద‌న ఉంది. పైగా.. గ‌తంలో దూకుడుగా ఉన్న నాయ‌కులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. మీడియా ముందు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. స‌ర్కారును ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్ర‌నాయ‌కుల‌కు ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే.. ప్ర‌బుత్వానికి ఇబ్బంది అంటూ స‌మాచారం చేరింది.

ముఖ్యంగా తిరుప‌తి తొక్కిస‌లాట‌పై.. బీజేపీ నాయ‌కులు తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో మ‌రింత‌గా ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా తాజా ప‌ర్య‌ట‌న‌లో నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. క‌లిసి మెలిసి ఉండాలంటూ.. సూచించారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌కులు ఎక్క‌డా వినిపించుకున్న‌ట్టు లేదు.

తాజాగా క‌మ‌లం పార్టీకి చెందిన అంబికా కృష్ణ‌.. స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిందంటే.. అది మోడీ చ‌ల‌వేన‌ని.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌నుల‌కు కేంద్రం ఇచ్చే సొమ్ములే ఆధార‌మ‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి ఇలా ఎవ‌రికి వారు.. వ్యాఖ్య‌లు చేస్తూ పోతే.. షా చెప్పిన ఫార్ములా ఏమైన‌ట్టు? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైనా బీజేపీ నేత‌లు సంస్క‌ర‌ణ దిశ‌గా అడుగులు వేయాల్సి ఉంది.

This post was last modified on January 22, 2025 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళా

ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…

44 minutes ago

కేసీఆర్‌కు భారీ ప్రాధాన్యం… రేవంత్ రెడ్డి వ్యూహ‌మేంటి?

ఏ రాష్ట్రంలో అయినా... ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌వు. స‌హ‌జంగా రాజ‌కీయ వైరాన్ని కొన‌సాగిస్తాయి. ఏపీ స‌హా…

58 minutes ago

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు…

1 hour ago

పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి…

5 hours ago

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

12 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

14 hours ago