Political News

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ స‌మీపంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఆయ‌న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చ‌ర్చించారు. ఇదేస‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌తోనూ మాట్లాడారు. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి మెలిసి ఉండాల‌ని సూచించారు. కానీ, ఈ విష‌యం ఇంకా బీజేపీ నాయ‌కుల‌కు ఒంట‌బట్టిన‌ట్టు లేద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మంత్రి వ‌ర్గంలోకి బీజేపీని కూడా తీసుకున్నారు. ధ‌ర్మ‌వరం ఎమ్మెల్యే స‌త్య‌కుమార్‌కు వైద్య శాఖ అప్ప‌గించారు. అయితే.. త‌మ‌కు మ‌రో ప‌ద‌వి కూడా కావాల‌న్న‌ది స్థానిక బీజేపీ నేత‌ల ప‌ట్టు. దీనిపై కేంద్రం స్థాయిలో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే.. త‌మ అవ‌స‌రాలు వేరే ఉన్న నేప‌థ్యంలో కూట‌మి పార్టీల‌తో క‌లిసి పోవాల‌ని బీజేపీ పెద్ద‌లు రాష్ట్ర స్థాయి నేత‌ల‌కు సూచించారు. వివాదాల‌కు తావివ్వ‌కుండా ముందుకు సాగాల‌ని కూడా సూచించారు.

దీనికి తొలుత ఓకే చెప్పిన క‌మ‌ల నాథులు.. త‌ర్వాత మాత్రం త‌మ పంథాలో తామే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు దూరం పాటిస్తున్నార‌న్న వాద‌న ఉంది. పైగా.. గ‌తంలో దూకుడుగా ఉన్న నాయ‌కులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. మీడియా ముందు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. స‌ర్కారును ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్ర‌నాయ‌కుల‌కు ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే.. ప్ర‌బుత్వానికి ఇబ్బంది అంటూ స‌మాచారం చేరింది.

ముఖ్యంగా తిరుప‌తి తొక్కిస‌లాట‌పై.. బీజేపీ నాయ‌కులు తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో మ‌రింత‌గా ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా తాజా ప‌ర్య‌ట‌న‌లో నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. క‌లిసి మెలిసి ఉండాలంటూ.. సూచించారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌కులు ఎక్క‌డా వినిపించుకున్న‌ట్టు లేదు.

తాజాగా క‌మ‌లం పార్టీకి చెందిన అంబికా కృష్ణ‌.. స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిందంటే.. అది మోడీ చ‌ల‌వేన‌ని.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌నుల‌కు కేంద్రం ఇచ్చే సొమ్ములే ఆధార‌మ‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి ఇలా ఎవ‌రికి వారు.. వ్యాఖ్య‌లు చేస్తూ పోతే.. షా చెప్పిన ఫార్ములా ఏమైన‌ట్టు? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైనా బీజేపీ నేత‌లు సంస్క‌ర‌ణ దిశ‌గా అడుగులు వేయాల్సి ఉంది.

Satya

Recent Posts

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

30 minutes ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

36 minutes ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

2 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

3 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

4 hours ago