Political News

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ స‌మీపంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఆయ‌న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చ‌ర్చించారు. ఇదేస‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌తోనూ మాట్లాడారు. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి మెలిసి ఉండాల‌ని సూచించారు. కానీ, ఈ విష‌యం ఇంకా బీజేపీ నాయ‌కుల‌కు ఒంట‌బట్టిన‌ట్టు లేద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మంత్రి వ‌ర్గంలోకి బీజేపీని కూడా తీసుకున్నారు. ధ‌ర్మ‌వరం ఎమ్మెల్యే స‌త్య‌కుమార్‌కు వైద్య శాఖ అప్ప‌గించారు. అయితే.. త‌మ‌కు మ‌రో ప‌ద‌వి కూడా కావాల‌న్న‌ది స్థానిక బీజేపీ నేత‌ల ప‌ట్టు. దీనిపై కేంద్రం స్థాయిలో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే.. త‌మ అవ‌స‌రాలు వేరే ఉన్న నేప‌థ్యంలో కూట‌మి పార్టీల‌తో క‌లిసి పోవాల‌ని బీజేపీ పెద్ద‌లు రాష్ట్ర స్థాయి నేత‌ల‌కు సూచించారు. వివాదాల‌కు తావివ్వ‌కుండా ముందుకు సాగాల‌ని కూడా సూచించారు.

దీనికి తొలుత ఓకే చెప్పిన క‌మ‌ల నాథులు.. త‌ర్వాత మాత్రం త‌మ పంథాలో తామే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు దూరం పాటిస్తున్నార‌న్న వాద‌న ఉంది. పైగా.. గ‌తంలో దూకుడుగా ఉన్న నాయ‌కులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. మీడియా ముందు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. స‌ర్కారును ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్ర‌నాయ‌కుల‌కు ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే.. ప్ర‌బుత్వానికి ఇబ్బంది అంటూ స‌మాచారం చేరింది.

ముఖ్యంగా తిరుప‌తి తొక్కిస‌లాట‌పై.. బీజేపీ నాయ‌కులు తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో మ‌రింత‌గా ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా తాజా ప‌ర్య‌ట‌న‌లో నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. క‌లిసి మెలిసి ఉండాలంటూ.. సూచించారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌కులు ఎక్క‌డా వినిపించుకున్న‌ట్టు లేదు.

తాజాగా క‌మ‌లం పార్టీకి చెందిన అంబికా కృష్ణ‌.. స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిందంటే.. అది మోడీ చ‌ల‌వేన‌ని.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌నుల‌కు కేంద్రం ఇచ్చే సొమ్ములే ఆధార‌మ‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి ఇలా ఎవ‌రికి వారు.. వ్యాఖ్య‌లు చేస్తూ పోతే.. షా చెప్పిన ఫార్ములా ఏమైన‌ట్టు? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైనా బీజేపీ నేత‌లు సంస్క‌ర‌ణ దిశ‌గా అడుగులు వేయాల్సి ఉంది.

This post was last modified on January 22, 2025 2:22 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

40 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago