Political News

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ఏం చేసినా చెల్లుతుంది. కానీ, అధికారంలోకి వ‌చ్చాక‌.. చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కానీ, ఈ విష‌యంలో అగ్ర‌రాజ్యం అమెరికా 47వ‌ అధ్య‌క్షుడుగా ప‌గ్గాలు చేప‌ట్టిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం.. సొంత దేశానికి చేటు తేవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు అదే దేశానికి చెందిన ఆర్థిక నిపుణులు.

అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అడ్డుకునేందుకు ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ, అస‌లు వ‌ల‌స‌ల‌పైనే ప్ర‌భావం చూపించేలా.. నిర్ణ‌యం తీసుకోవ‌డం, బై బ‌ర్త్ గ్రీన్ కార్డు ఫెసిలిటీని ఎత్తేయ‌డం.. వంటివి ప్ర‌పంచ దేశాల‌ను కుదిపేస్తున్నాయి. ప్ర‌ధానంగా భార‌త్‌, చైనా, మెక్సికో స‌హా అనేక దేశాల నుంచి అమెరికాకు వ‌ల‌స వెళ్తున్న‌వారు ఎక్కువ‌గా ఉన్నారు. ఒక్క మెక్సికో నుంచి మాత్రమే అక్ర‌మ వ‌ల‌స‌లు జ‌రుగుతున్నాయన్న‌ది వాస్త‌వం. ఇక్క‌డ అడ్డుక‌ట్ట వేసేందుకే ఇదే ట్రంప్ గ‌తంలో మెక్సికో చుట్టూ గోడ క‌ట్టించారు.

దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఖ‌జానా ఖాళీ అవుతున్నా అప్ప‌ట్లో ట్రంప్ ప‌ట్టించుకోలేదు. అయిన‌ప్పటికీ.. వ‌ల‌స‌లు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్పుడు మొత్తానికే ఎస‌రుపెడుతూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. ఇలా వ‌ల‌స‌ల‌ను, బై బ‌ర్త్ సిటిజ‌న్ షిప్‌ను నిలిపి వేయ‌డం వ‌ల్ల దేశం ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. “ప్ర‌పంచ దేశాల‌తో పోల్చుకుంటే మా దేశానికి ఇమ్మిగ్రేష‌న్ ఆదాయం ఎక్కువ‌. ఇత‌ర ఆదాయాల‌కంటే ఎక్కువ‌గా వ‌స్తోంది. ఇప్పుడు దీనిపై ప్ర‌భావం చూపించేలా నిర్ణ‌యం తీసుకుంటే అది మరింత న‌ష్టం” అని ఆర్థిక నిపుణుడు రిచ‌ర్డ్ హెచ్చ‌రించారు.

కాగా.. అమెరికాకు ఏటా వివిధ రూపాల్లో వ‌చ్చే ఆదాయంలో వీసాలు, ఇమ్మిగ్రేష‌న్ డిపార్ట్ మెంట్ ద్వారా 28 శాతం ఆదాయం స‌మకూరుతోంది. ఇది కీల‌క‌మైన ఐటీ, పారిశ్రామిక రంగాల‌తో పోల్చుకుంటే 2 శాతం ఎక్కువ‌గా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. పైగా.. దీనివ‌ల్ల న‌ష్టం లేద‌ని కూడా అంటున్నారు. ఇదేస‌మ‌యంలో అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై ఆందోళ‌న ఉంద‌ని చెబుతున్నారు. దీనిని నిలుపుద‌ల చేసేందుకు ఇలాంటి నిర్ణ‌యం స‌రికాదంటున్నారు.

మ‌రోవైపు భార‌త ఆర్థిక నిపుణులు కూడా.. ట్రంప్ నిర్ణ‌యం అమెరికాను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతుంద‌ని పేర్కొంటూ.. గ‌తంలో క‌రోనా స‌మ‌యంలో ట్రంప్ వ్య‌వ‌హ‌రించిన తీరును వారు ప్ర‌స్తావిస్తున్నారు. అప్ప‌ట్లోనూ మొండిగా వ్య‌వ‌హ‌రించి.. క‌రోనా దేశ‌వ్యాప్తంగా వ్యాపించేలా చేశార‌ని వారు చెబుతున్నారు.

This post was last modified on January 22, 2025 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago