ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులు ఓటమి పాలవుతున్నారు. లక్ష పెట్టుబడి పెట్టి కోటి సంపాదించాలనుకునే రాజకీయ వ్యాపారులు గెలుస్తున్నారు. దీనివల్ల చట్ట సభల్లో ప్రజల గొంతు వినిపించడం ఆగిపోయింది. రాజకీయ అవినీతి పెచ్చు మీరింది. ఫలితంగా అభివృద్ధి కుంటు పడుతోంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. మహిళలతో చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానేయాలని సూచించారు. ఏ నాయకుడు కూడా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రాడని, వాళ్ళు పంపిణీ చేసేదాంత అవినీతి సొమ్మే అని చెప్పారు.
ఓటుకు 2 వేలు ఇచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత 2 లక్షలు సంపాదించుకుంటారు. వాళ్ళు సంపాదించే అవినీతి సొమ్ములో మీకు చిల్లర పైసలు విదుల్చుతారనికి చెప్పారు. ఒకసారి ఓటు అమ్ముకున్నాక నాయకులను ప్రశ్నించే పరిస్థితి ఉండదు. మనం చులకన అయిపోతాం. ఎన్ని పనులు చేసినా ఎవడు పది రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్లకు ఓటేస్తున్నారు. ఇది సరికాదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. వరసగా మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ధన ప్రవాహన్ని ఇప్పటి నుంచే అడ్డుకోవాలి. అది మహిళల నుంచే ప్రారంభం కావాలని ప్రజాస్వామిక వాదులు చర్చిస్తున్నారు. నోటుకు ఓటును అడ్డుకున్నప్పుడే సచ్చరిత కలిగిన నాయకులు ఎన్నికవుతారని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
This post was last modified on August 16, 2026 9:30 am
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…