Political News

జ‌నం… జ‌గ‌న్‌ను మ‌రిచిపోతున్నారు: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను జ‌నం మ‌రిచిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ప్ర‌జ‌లు `జ‌గ‌న్ అంటే ఎవ‌రు?` అని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. మ‌రో 20 శాతం మంది కూడా త్వ‌ర‌లోనే మ‌రిచిపోయే రోజు రానుంద‌ని చెప్పుకొచ్చారు. తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. ప్ర‌ధాన మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

“జ‌గ‌న్ ప‌ని అయిపోయింది. ఇంకా జ‌గ‌న్ అని అంటారేంటి? ప్ర‌జ‌లు కూడా ఎప్పుడో మ‌రిచిపోయారు. నెల నెలా రూ.4000 చొప్పున పింఛ‌ను ఇంటింటికీ చేరుతోంది. ఇంక‌.. జ‌గ‌న్ ఎందుక‌బ్బా అని జ‌నాలే అంటున్నారు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భావం ఎక్కడా క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోందన్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు చెప్పారు.

వైసీపీ హ‌యాంలో విశాఖ‌కు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేద‌ని.. తాము తీసుకువ‌చ్చిన ప్రాజెక్టుల‌ను కూడా.. వైసీపీ త‌రిమేసింద‌ని నారా లోకేష్ అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ.. త‌ర్వాత వాటిని తుంగ‌లోకి తొక్కింద‌ని విమ‌ర్శించారు. ఉద్యోగుల‌ను నిండా ముంచార‌ని.. వారికి సీపీఎస్ ను ర‌ద్దు చేస్తాన‌ని చెప్పి కూడా.. చేయ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ హ‌యాంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేశార‌ని.. ప్ర‌స్తుతం వాటినిగాడిలో పెడుతున్నామ‌ని చెప్పారు. దీనికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

కూట‌మి ప్ర‌భుత్వం చెప్పిన ప్ర‌తి ప‌నినీ చేస్తుంద‌ని నారా లోక‌ష్ చెప్పారు. ప్ర‌స్తుతం అభివృద్ధి పై ఎక్కువ‌గా దృష్టి పెట్టామ‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే సంప‌ద సృష్టి జ‌రుగుతుంద‌ని.. దీంతో అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రావ‌డం ద్వారా.. ఆయ‌న‌తో మ‌న బంధం మ‌రింత పెరుగుతుంద‌ని.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా ఆయ‌న‌ను ఒప్పిస్తామ‌ని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

This post was last modified on January 5, 2025 5:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

14 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago