Political News

జ‌నం… జ‌గ‌న్‌ను మ‌రిచిపోతున్నారు: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను జ‌నం మ‌రిచిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ప్ర‌జ‌లు `జ‌గ‌న్ అంటే ఎవ‌రు?` అని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. మ‌రో 20 శాతం మంది కూడా త్వ‌ర‌లోనే మ‌రిచిపోయే రోజు రానుంద‌ని చెప్పుకొచ్చారు. తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. ప్ర‌ధాన మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

“జ‌గ‌న్ ప‌ని అయిపోయింది. ఇంకా జ‌గ‌న్ అని అంటారేంటి? ప్ర‌జ‌లు కూడా ఎప్పుడో మ‌రిచిపోయారు. నెల నెలా రూ.4000 చొప్పున పింఛ‌ను ఇంటింటికీ చేరుతోంది. ఇంక‌.. జ‌గ‌న్ ఎందుక‌బ్బా అని జ‌నాలే అంటున్నారు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భావం ఎక్కడా క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోందన్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు చెప్పారు.

వైసీపీ హ‌యాంలో విశాఖ‌కు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేద‌ని.. తాము తీసుకువ‌చ్చిన ప్రాజెక్టుల‌ను కూడా.. వైసీపీ త‌రిమేసింద‌ని నారా లోకేష్ అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ.. త‌ర్వాత వాటిని తుంగ‌లోకి తొక్కింద‌ని విమ‌ర్శించారు. ఉద్యోగుల‌ను నిండా ముంచార‌ని.. వారికి సీపీఎస్ ను ర‌ద్దు చేస్తాన‌ని చెప్పి కూడా.. చేయ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ హ‌యాంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేశార‌ని.. ప్ర‌స్తుతం వాటినిగాడిలో పెడుతున్నామ‌ని చెప్పారు. దీనికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

కూట‌మి ప్ర‌భుత్వం చెప్పిన ప్ర‌తి ప‌నినీ చేస్తుంద‌ని నారా లోక‌ష్ చెప్పారు. ప్ర‌స్తుతం అభివృద్ధి పై ఎక్కువ‌గా దృష్టి పెట్టామ‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే సంప‌ద సృష్టి జ‌రుగుతుంద‌ని.. దీంతో అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రావ‌డం ద్వారా.. ఆయ‌న‌తో మ‌న బంధం మ‌రింత పెరుగుతుంద‌ని.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా ఆయ‌న‌ను ఒప్పిస్తామ‌ని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

This post was last modified on January 5, 2025 5:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

39 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

59 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago