ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు అనేక మెరుపులు మెరిపించింది. ఉద్యోగాలు, ఉపాధి, రైతు రుణమాఫీ, బస్సు ప్రయాణాలు వంటివి అందిస్తూనే.. మరోవైపు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
తాజాగా ఈ విషయాలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకు చేయని విధంగా ఏడాది పాటు తాము ప్రజలపై వరాల జల్లు కురిపించినట్టు చెప్పారు.
తాజాగా ప్రజాభవన్(గతంలో ప్రగతి భవన్)లో నిర్వహించిన రాజీవ్గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్ర మంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కింద శిక్షణ పూర్తి చేసుకుని మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రేవంత్ రెడ్డి సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టిన కేవలం ఏడాది కాలంలోనే 55,143 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
సివిల్స్కు ఎంపిక అయినప్పటికీ.. ఎక్కడ పనిచేసినా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన యాస్పిరెంట్స్ను కోరారు. పది సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యను ఎవరూ పట్టించుకోలేదంటూ.. గత బీఆర్ఎస్ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు.
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. కానీ, కొందరు తమ ప్రయత్నాలకు అడ్డు పడుతున్నారని.. అయినా న్యాయపోరాటాలతో అన్ని స్థాయిల్లోనూ విజయం దక్కించుకుంటున్నట్టు తెలిపారు.
కేవలం ఏడాది పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అయినప్ప టికీ.. గత పదేళ్ల అలసత్వం.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అభివృద్ధి సుమాలు అందలేదన్నారు. తాము చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్టు చెప్పారు.
This post was last modified on January 5, 2025 5:21 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…