ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు అనేక మెరుపులు మెరిపించింది. ఉద్యోగాలు, ఉపాధి, రైతు రుణమాఫీ, బస్సు ప్రయాణాలు వంటివి అందిస్తూనే.. మరోవైపు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
తాజాగా ఈ విషయాలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకు చేయని విధంగా ఏడాది పాటు తాము ప్రజలపై వరాల జల్లు కురిపించినట్టు చెప్పారు.
తాజాగా ప్రజాభవన్(గతంలో ప్రగతి భవన్)లో నిర్వహించిన రాజీవ్గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్ర మంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కింద శిక్షణ పూర్తి చేసుకుని మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రేవంత్ రెడ్డి సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టిన కేవలం ఏడాది కాలంలోనే 55,143 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
సివిల్స్కు ఎంపిక అయినప్పటికీ.. ఎక్కడ పనిచేసినా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన యాస్పిరెంట్స్ను కోరారు. పది సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యను ఎవరూ పట్టించుకోలేదంటూ.. గత బీఆర్ఎస్ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు.
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. కానీ, కొందరు తమ ప్రయత్నాలకు అడ్డు పడుతున్నారని.. అయినా న్యాయపోరాటాలతో అన్ని స్థాయిల్లోనూ విజయం దక్కించుకుంటున్నట్టు తెలిపారు.
కేవలం ఏడాది పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అయినప్ప టికీ.. గత పదేళ్ల అలసత్వం.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అభివృద్ధి సుమాలు అందలేదన్నారు. తాము చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్టు చెప్పారు.
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…