ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు అనేక మెరుపులు మెరిపించింది. ఉద్యోగాలు, ఉపాధి, రైతు రుణమాఫీ, బస్సు ప్రయాణాలు వంటివి అందిస్తూనే.. మరోవైపు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
తాజాగా ఈ విషయాలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకు చేయని విధంగా ఏడాది పాటు తాము ప్రజలపై వరాల జల్లు కురిపించినట్టు చెప్పారు.
తాజాగా ప్రజాభవన్(గతంలో ప్రగతి భవన్)లో నిర్వహించిన రాజీవ్గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్ర మంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కింద శిక్షణ పూర్తి చేసుకుని మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రేవంత్ రెడ్డి సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టిన కేవలం ఏడాది కాలంలోనే 55,143 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
సివిల్స్కు ఎంపిక అయినప్పటికీ.. ఎక్కడ పనిచేసినా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన యాస్పిరెంట్స్ను కోరారు. పది సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యను ఎవరూ పట్టించుకోలేదంటూ.. గత బీఆర్ఎస్ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు.
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. కానీ, కొందరు తమ ప్రయత్నాలకు అడ్డు పడుతున్నారని.. అయినా న్యాయపోరాటాలతో అన్ని స్థాయిల్లోనూ విజయం దక్కించుకుంటున్నట్టు తెలిపారు.
కేవలం ఏడాది పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అయినప్ప టికీ.. గత పదేళ్ల అలసత్వం.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అభివృద్ధి సుమాలు అందలేదన్నారు. తాము చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్టు చెప్పారు.
This post was last modified on January 5, 2025 5:21 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…