Political News

జ‌న‌సేనాని దూకుడు.. కేంద్రం ఫిదా!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా.. ప‌నితీరు విష‌యంలో మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌.. నిధుల స‌మీక‌ర‌ణ‌.. ఈ రెండు విష‌యాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా నిక్క‌చ్చిగా ఉంటున్నారు. చంద్ర‌బాబు సైన్యంలో జ‌న‌సేనాని డిఫ‌రెంట్ అనే టాక్ వ‌చ్చేలా ఆయ‌న చేసుకున్నారు. పంచాయ‌తీ రాజ్ గ్రామీణ అభివృద్ది శాఖల‌ను అత్యంత కీల‌కంగా భావిస్తున్న ప‌వ‌న్ .. వాటిలో అభివృద్దికి పెద్ద‌పీట వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప‌క్కాగా తెచ్చుకుంటున్నారు. ఇది రాష్ట్రంపై భారం ప‌డ‌కుండా.. ప‌నులు సులువుగా చేసుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డేలా చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల‌ను ప్ర‌తి రూపాయి తెచ్చుకోవ‌డం లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌క్సెస్ అవుతున్నారు. వీటి ద్వారా.. జ‌ల జీవ‌న్ మిష‌న్‌కు కేటాయించిన నిధులు.. ఉపాధి హామీ ప‌నుల‌కు కేటాయించిన నిధుల‌ను విడ‌దీసి.. వేటిక‌వే వినియోగిస్తున్నారు.

త‌ద్వారా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రూపు రేఖ‌లు ఇప్పుడు మారే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ర‌హ‌దారుల‌ను బాగు చేయాల‌న్న సంక‌ల్పంతో ప‌వ‌న్ ముందుకు సాగుతున్నారు. ర‌హ‌దారుల నిర్మాణ‌మే కాదు.. వాటి నిర్మాణ తీరును, నాణ్యత‌ను కూడా ఆయ‌న ప‌క్కాగా ప‌రిశీల‌న చేస్తున్నారు. దీంతో ప‌నుల్లో నాణ్య‌త పెర‌గ‌డంతోపాటు అధికారుల్లో జవాబు దారీ త‌నం కూడా పెరిగింది.

డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ ప‌నితీరుకు మెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా నిధుల‌ను విడుద‌ల చేస్తుండం గ‌మ‌నార్హం. తాజాగా గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ ను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గ్రాంట్స్ కింద 446.49 కోట్ల రూపాయ‌ల‌ను నేరుగా ప‌వ‌న్ నేతృత్వం వ‌హిస్తున్న పంచాయ‌తీ రాజ్ ఖాతాకు కేంద్రం బ‌దిలీ చేసింది. రాష్ట్రంలోని 1397 గ్రామపంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్ లు అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. మొత్తానికి ప‌గ్గాలు చేప‌ట్టిన ఆరు మాసాల్లోనే ప‌వ‌న్ ఇంత పెద్ద మొత్తం సాధించ‌డం విశేషం.

This post was last modified on December 25, 2024 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

10 minutes ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

2 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

2 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

3 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

3 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

4 hours ago