మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్ గా పలకరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చేశాక ఇప్పటి జెనరేషన్ తో కనెక్టివిటీ వచ్చింది. అంతకు ముందు మనమంతాలో లీడ్ రోల్ చేసినా అదేమంత ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా ఆయన దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నం బరోజ్ ఇవాళ థియేటర్లలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. నిన్న ప్రీ రిలీజ్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా ఎదిగిందని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను చాలా గౌరవిస్తారని, ఎన్నో అద్భుతమైన హిట్లు ఇస్తున్నారని ఇటీవలే పుష్ప 2తో అది మరోసారి రుజువయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. జనతా గ్యారేజ్ లో నటించడం వల్ల మైత్రి వాళ్ళు బరోజ్ తీసుకోలేదని, ట్రైలర్ లో కంటెంట్ నచ్చాకే ముందుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రజనీకాంత్ చిరంజీవి లాంటి స్టార్లలో స్నేహం కొనసాగిస్తూ ఈ తరంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని లాల్ చెప్పారు.
This post was last modified on December 25, 2024 11:52 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…