మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్ గా పలకరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చేశాక ఇప్పటి జెనరేషన్ తో కనెక్టివిటీ వచ్చింది. అంతకు ముందు మనమంతాలో లీడ్ రోల్ చేసినా అదేమంత ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా ఆయన దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నం బరోజ్ ఇవాళ థియేటర్లలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. నిన్న ప్రీ రిలీజ్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా ఎదిగిందని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను చాలా గౌరవిస్తారని, ఎన్నో అద్భుతమైన హిట్లు ఇస్తున్నారని ఇటీవలే పుష్ప 2తో అది మరోసారి రుజువయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. జనతా గ్యారేజ్ లో నటించడం వల్ల మైత్రి వాళ్ళు బరోజ్ తీసుకోలేదని, ట్రైలర్ లో కంటెంట్ నచ్చాకే ముందుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రజనీకాంత్ చిరంజీవి లాంటి స్టార్లలో స్నేహం కొనసాగిస్తూ ఈ తరంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని లాల్ చెప్పారు.
This post was last modified on December 25, 2024 11:52 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…