మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్ గా పలకరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చేశాక ఇప్పటి జెనరేషన్ తో కనెక్టివిటీ వచ్చింది. అంతకు ముందు మనమంతాలో లీడ్ రోల్ చేసినా అదేమంత ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా ఆయన దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నం బరోజ్ ఇవాళ థియేటర్లలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. నిన్న ప్రీ రిలీజ్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా ఎదిగిందని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను చాలా గౌరవిస్తారని, ఎన్నో అద్భుతమైన హిట్లు ఇస్తున్నారని ఇటీవలే పుష్ప 2తో అది మరోసారి రుజువయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. జనతా గ్యారేజ్ లో నటించడం వల్ల మైత్రి వాళ్ళు బరోజ్ తీసుకోలేదని, ట్రైలర్ లో కంటెంట్ నచ్చాకే ముందుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రజనీకాంత్ చిరంజీవి లాంటి స్టార్లలో స్నేహం కొనసాగిస్తూ ఈ తరంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని లాల్ చెప్పారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…