మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్ గా పలకరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చేశాక ఇప్పటి జెనరేషన్ తో కనెక్టివిటీ వచ్చింది. అంతకు ముందు మనమంతాలో లీడ్ రోల్ చేసినా అదేమంత ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా ఆయన దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నం బరోజ్ ఇవాళ థియేటర్లలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. నిన్న ప్రీ రిలీజ్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా ఎదిగిందని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను చాలా గౌరవిస్తారని, ఎన్నో అద్భుతమైన హిట్లు ఇస్తున్నారని ఇటీవలే పుష్ప 2తో అది మరోసారి రుజువయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. జనతా గ్యారేజ్ లో నటించడం వల్ల మైత్రి వాళ్ళు బరోజ్ తీసుకోలేదని, ట్రైలర్ లో కంటెంట్ నచ్చాకే ముందుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రజనీకాంత్ చిరంజీవి లాంటి స్టార్లలో స్నేహం కొనసాగిస్తూ ఈ తరంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని లాల్ చెప్పారు.
This post was last modified on December 25, 2024 11:52 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…