ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. ఉరఫ్ నాని.. టీడీపీలో చేరుతున్నారంటూ గత వారం పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రధాన మీడియాలోనే ఈ వార్తలు రావడం.. ఇంకేముంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న చర్చ సాగడంతో ఆయన దాదాపు పార్టీ మారిపోతున్నారన్నది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ, ఇటు టీడీపీ నుంచి అటు ఆళ్ల వర్గం నుంచి కూడా ఎక్కడా ఈ విషయంపై స్పందన రాలేదు.
దీంతో అసలు ఏం జరిగింది? క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అనేవి ఆసక్తిగా మారా యి. ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకునే విషయంలో చంద్రబాబు సుముఖంగానే ఉన్నారు. వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలన్న కొందరి సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో చాలా మంది నాయకులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. అయితే.. ఆళ్ల విషయానికి వస్తే.. ఎందుకు బ్రేక్ పడిందన్నది చర్చ.
ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్ల నాని.. టీడీపీ నేతలను అణిచి వేశారన్న చర్చ ఉంది. ఫొటోలు ఆధారాలతో ఇటీవల ఇక్కడి నాయకులు బయట పెట్టారు. దీంతో చంద్రబాబు వెనక్కి తగ్గారన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. కానీ, అసలు విషయం వేరేగా ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా.. టీడీపీ టీం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆళ్ల నానికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని తెలిసింది.
మెజారిటీ ప్రజలు ఆయన రాజకీయాలను ఇష్టపడడం లేదని.. అందుకే.. చంద్రబాబు ఆళ్ల విషయంలో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు చేర్చుకున్నవారి విషయంలో ఐవీఆర్ఎస్ సర్వే చేయని చంద్రబాబు ఇప్పుడు ఆళ్ల విషయంలో ఎందుకు చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటి వరకు వచ్చిన వారిలో చాలా మంది పదవుల్లో ఉండి వచ్చారు. ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఉన్నవారే పార్టీ మారారు. దీంతో వారి విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నా.. తీసుకున్నారు.
నిజానికి మోపిదేవి వెంకటరమణను పార్టీలో చేర్చుకునేందుకు.. ఓ కీలక మంత్రి అడ్డు పడ్డారు. అయినా.. చంద్రబాబు స్వాగతించారు. కానీ, ఆళ్ల విషయంలో మౌనంగా ఉన్నారు. దీనికి కారణం.. ఐవీఆర్ఎస్ సర్వే ఫలితమేనని అంటున్నారు సీనియర్ నాయకులు. ప్రజలు పెద్దగా ఆళ్ల నానిని పట్టించుకోవడం లేదని.. కాబట్టి.. ఆయనను చేర్చుకోలేదని.. భవిష్యత్తులో ఆయన ఇమేజ్ పెరిగితే.. చేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల.. తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనే ఆయన ఇమేజ్ను డ్యామేజీ చేసిందని అంటున్నారు.
This post was last modified on December 12, 2024 9:01 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…