Political News

బుద్ధొచ్చింది.. క్ష‌మించండి: శ్రీరెడ్డి కాళ్ల‌బేరం

వివాదాస్ప వ్యాఖ్య‌ల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసే.. న‌టి శ్రీరెడ్డి కాళ్ల‌బేరానికి వ‌చ్చారు. వైసీపీసానుభూతి ప‌రురాలిగా మారి.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌లు.. అత్యంత వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే. ఎంత నోటికి అంత మాట అనేయ‌డం.. కూడా మ‌హిళ‌గా ఆమెకే చెల్లింది. చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌నే కాకుండా.. వారి కుటుం బాల‌ను కూడా రోడ్డుకు ఈడ్చి.. మ‌హిళ‌ల‌ను కూడా ఇష్టానుసారం నోరు చేసుకున్న శ్రీరెడ్డి తాజాగా కాళ్ల బేరానికి వ‌చ్చింది. ఏపీలో వివాదాస్ప‌ద సోష‌ల్ మీడియా వ్య‌క్తుల‌పై ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో శ్రీరెడ్డి అనుచ‌రులు, సోష‌ల్ మీడియాలో ఆమె వ్యాఖ్య‌ల‌కు లైకులు కొట్టి, ఫార్వ‌ర్డ్ చేసిన టీం స‌భ్యుల‌పై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో శ్రీరెడ్డికి మూడింద‌న్న వాద‌న వినిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరెడ్డి దిగి వ‌చ్చారు. బుద్ధొచ్చింది.. క్ష‌మించండి.. ఇక‌పై బుద్ధిగా ఉంటా! అంటూ.. చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌స్తుత ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ల‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో ఒక‌టి విడుద‌ల చేసింది. దీనిలో ఆమె వారిని .. త‌న‌ను క్ష‌మించాల‌ని ప‌దే ప‌దే కోరుకుంది.

“నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని శ్రీరెడ్డి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌న వల్ల త‌న ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్న‌ట్టు తెలిపింది. “ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల(ప‌వ‌న్‌, చంద్ర‌బాబు, లోకేష్‌, అనిత) గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు” అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా త‌న‌తోపాటు త‌న కార్య‌క‌ర్త‌లు, సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్ల‌ను వ‌దిలేయాల‌ని కూడా కోరింది. ఇక‌, నుంచి తాము జాగ్ర‌త్త‌గా ఉంటామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on November 9, 2024 7:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

42 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

48 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago