Political News

బుద్ధొచ్చింది.. క్ష‌మించండి: శ్రీరెడ్డి కాళ్ల‌బేరం

వివాదాస్ప వ్యాఖ్య‌ల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసే.. న‌టి శ్రీరెడ్డి కాళ్ల‌బేరానికి వ‌చ్చారు. వైసీపీసానుభూతి ప‌రురాలిగా మారి.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌లు.. అత్యంత వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే. ఎంత నోటికి అంత మాట అనేయ‌డం.. కూడా మ‌హిళ‌గా ఆమెకే చెల్లింది. చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌నే కాకుండా.. వారి కుటుం బాల‌ను కూడా రోడ్డుకు ఈడ్చి.. మ‌హిళ‌ల‌ను కూడా ఇష్టానుసారం నోరు చేసుకున్న శ్రీరెడ్డి తాజాగా కాళ్ల బేరానికి వ‌చ్చింది. ఏపీలో వివాదాస్ప‌ద సోష‌ల్ మీడియా వ్య‌క్తుల‌పై ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో శ్రీరెడ్డి అనుచ‌రులు, సోష‌ల్ మీడియాలో ఆమె వ్యాఖ్య‌ల‌కు లైకులు కొట్టి, ఫార్వ‌ర్డ్ చేసిన టీం స‌భ్యుల‌పై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో శ్రీరెడ్డికి మూడింద‌న్న వాద‌న వినిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరెడ్డి దిగి వ‌చ్చారు. బుద్ధొచ్చింది.. క్ష‌మించండి.. ఇక‌పై బుద్ధిగా ఉంటా! అంటూ.. చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌స్తుత ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ల‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో ఒక‌టి విడుద‌ల చేసింది. దీనిలో ఆమె వారిని .. త‌న‌ను క్ష‌మించాల‌ని ప‌దే ప‌దే కోరుకుంది.

“నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని శ్రీరెడ్డి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌న వల్ల త‌న ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్న‌ట్టు తెలిపింది. “ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల(ప‌వ‌న్‌, చంద్ర‌బాబు, లోకేష్‌, అనిత) గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు” అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా త‌న‌తోపాటు త‌న కార్య‌క‌ర్త‌లు, సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్ల‌ను వ‌దిలేయాల‌ని కూడా కోరింది. ఇక‌, నుంచి తాము జాగ్ర‌త్త‌గా ఉంటామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Satya

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

10 minutes ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

26 minutes ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

2 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

3 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

5 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

8 hours ago