వివాదాస్ప వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే.. నటి శ్రీరెడ్డి కాళ్లబేరానికి వచ్చారు. వైసీపీసానుభూతి పరురాలిగా మారి.. టీడీపీ, జనసేనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు.. అత్యంత వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఎంత నోటికి అంత మాట అనేయడం.. కూడా మహిళగా ఆమెకే చెల్లింది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్లనే కాకుండా.. వారి కుటుం బాలను కూడా రోడ్డుకు ఈడ్చి.. మహిళలను కూడా ఇష్టానుసారం నోరు చేసుకున్న శ్రీరెడ్డి తాజాగా కాళ్ల బేరానికి వచ్చింది. ఏపీలో వివాదాస్పద సోషల్ మీడియా వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అనుచరులు, సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలకు లైకులు కొట్టి, ఫార్వర్డ్ చేసిన టీం సభ్యులపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో శ్రీరెడ్డికి మూడిందన్న వాదన వినిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరెడ్డి దిగి వచ్చారు. బుద్ధొచ్చింది.. క్షమించండి.. ఇకపై బుద్ధిగా ఉంటా! అంటూ.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, ప్రస్తుత ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలను ఉద్దేశించి సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేసింది. దీనిలో ఆమె వారిని .. తనను క్షమించాలని పదే పదే కోరుకుంది.
“నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని శ్రీరెడ్డి పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తన వల్ల తన ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపింది. “ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల(పవన్, చంద్రబాబు, లోకేష్, అనిత) గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు” అని పేర్కొనడం గమనార్హం. అదేవిధంగా తనతోపాటు తన కార్యకర్తలు, సోషల్ మీడియా ఫాలోవర్లను వదిలేయాలని కూడా కోరింది. ఇక, నుంచి తాము జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 9, 2024 7:04 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…