వివాదాస్ప వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే.. నటి శ్రీరెడ్డి కాళ్లబేరానికి వచ్చారు. వైసీపీసానుభూతి పరురాలిగా మారి.. టీడీపీ, జనసేనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు.. అత్యంత వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఎంత నోటికి అంత మాట అనేయడం.. కూడా మహిళగా ఆమెకే చెల్లింది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్లనే కాకుండా.. వారి కుటుం బాలను కూడా రోడ్డుకు ఈడ్చి.. మహిళలను కూడా ఇష్టానుసారం నోరు చేసుకున్న శ్రీరెడ్డి తాజాగా కాళ్ల బేరానికి వచ్చింది. ఏపీలో వివాదాస్పద సోషల్ మీడియా వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అనుచరులు, సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలకు లైకులు కొట్టి, ఫార్వర్డ్ చేసిన టీం సభ్యులపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో శ్రీరెడ్డికి మూడిందన్న వాదన వినిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరెడ్డి దిగి వచ్చారు. బుద్ధొచ్చింది.. క్షమించండి.. ఇకపై బుద్ధిగా ఉంటా! అంటూ.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, ప్రస్తుత ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలను ఉద్దేశించి సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేసింది. దీనిలో ఆమె వారిని .. తనను క్షమించాలని పదే పదే కోరుకుంది.
“నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని శ్రీరెడ్డి పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తన వల్ల తన ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపింది. “ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల(పవన్, చంద్రబాబు, లోకేష్, అనిత) గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు” అని పేర్కొనడం గమనార్హం. అదేవిధంగా తనతోపాటు తన కార్యకర్తలు, సోషల్ మీడియా ఫాలోవర్లను వదిలేయాలని కూడా కోరింది. ఇక, నుంచి తాము జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 9, 2024 7:04 am
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…