సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. జనసేన పార్టీలో ప్రత్యేక విభాగాన్ని(స్పెషల్ వింగ్) ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘నరసింహ వారాహి గణం’ పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అనుకునేవారు ఈ విభాగంలో ఉంటారని తెలిపారు. ఈ బృందంలో ఉన్నవారు ఆలయాల రక్షణతో పాటు భక్తుల మనోభావాల పరిరక్షకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు గత వైసీపీ ప్రభుత్వంలో చిత్తు కాయితాల మాదిరిగా తయారయ్యాయని.. నేతలు.. కనీసం హిందువులను పట్టించుకోలేదని అన్నా రు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం.. స్తానిక నరసింహ క్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు జనసేన కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. ఇతర మతాలకు తాను కానీ, జనసేన కానీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఇతర మతాలను కూడా గౌరవిస్తామని చెప్పారు. “అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి..మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవు” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు ‘ఓజీ’ సినిమాపై నినాదాలు చేశారు. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ చిరాకు ప్రదర్శించారు. “సరదా కోసం సినిమా ఉండాలి. కానీ, ఆ సినిమా చూడాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలి. సినిమా పేర్లతో అరిచే బదులు భగవంతుని నామస్మరణ చేయండి. దేవుడిని తలుచుకుంటే.. అద్భుతాలు జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు. భక్తులకు అండగా నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతగా ఉండాలనేది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ కూడా నిబద్ధతతో ఉందని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమయింది కాబట్టే..తాను దీక్ష చేపట్టినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
This post was last modified on November 2, 2024 6:32 am
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…