Political News

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు జ‌న‌సేన‌లో ‘స్పెష‌ల్ వింగ్‌’

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం.. జ‌న‌సేన పార్టీలో ప్ర‌త్యేక విభాగాన్ని(స్పెష‌ల్ వింగ్‌) ఏర్పాటు చేస్తున్న‌ట్టు జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ‘నరసింహ వారాహి గణం’ పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించాల‌ని అనుకునేవారు ఈ విభాగంలో ఉంటార‌ని తెలిపారు. ఈ బృందంలో ఉన్న‌వారు ఆల‌యాల ర‌క్ష‌ణ‌తో పాటు భ‌క్తుల మ‌నోభావాల ప‌రిర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేర్కొన్నారు. హిందువుల మ‌నోభావాలు గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో చిత్తు కాయితాల మాదిరిగా త‌యార‌య్యాయ‌ని.. నేత‌లు.. క‌నీసం హిందువుల‌ను ప‌ట్టించుకోలేద‌ని అన్నా రు.

తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక్క‌డ ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కాన్ని ప్రారంభించారు. అనంత‌రం.. స్తానిక న‌ర‌సింహ క్షేత్రాన్ని సంద‌ర్శించారు. అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించేందుకు జ‌న‌సేన క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. రాష్ట్రంలో స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అయితే.. ఇత‌ర మ‌తాల‌కు తాను కానీ, జ‌న‌సేన కానీ వ్య‌తిరేకం కాద‌ని తెలిపారు. ఇత‌ర మతాల‌ను కూడా గౌర‌విస్తామ‌ని చెప్పారు. “అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి..మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవు” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా కొంద‌రు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ‘ఓజీ’ సినిమాపై నినాదాలు చేశారు. ఈనేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చిరాకు ప్ర‌ద‌ర్శించారు. “సరదా కోసం సినిమా ఉండాలి. కానీ, ఆ సినిమా చూడాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలి. సినిమా పేర్లతో అరిచే బదులు భగవంతుని నామస్మరణ చేయండి. దేవుడిని త‌లుచుకుంటే.. అద్భుతాలు జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు. భ‌క్తుల‌కు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ భ‌ద్ర‌త‌గా ఉండాల‌నేది త‌న ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో పార్టీ కూడా నిబ‌ద్ధ‌త‌తో ఉంద‌ని తెలిపారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం అప‌విత్ర‌మ‌యింది కాబ‌ట్టే..తాను దీక్ష చేప‌ట్టిన‌ట్టు ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.

This post was last modified on November 2, 2024 6:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 minutes ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago