సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. జనసేన పార్టీలో ప్రత్యేక విభాగాన్ని(స్పెషల్ వింగ్) ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘నరసింహ వారాహి గణం’ పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అనుకునేవారు ఈ విభాగంలో ఉంటారని తెలిపారు. ఈ బృందంలో ఉన్నవారు ఆలయాల రక్షణతో పాటు భక్తుల మనోభావాల పరిరక్షకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు గత వైసీపీ ప్రభుత్వంలో చిత్తు కాయితాల మాదిరిగా తయారయ్యాయని.. నేతలు.. కనీసం హిందువులను పట్టించుకోలేదని అన్నా రు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం.. స్తానిక నరసింహ క్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు జనసేన కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. ఇతర మతాలకు తాను కానీ, జనసేన కానీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఇతర మతాలను కూడా గౌరవిస్తామని చెప్పారు. “అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి..మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవు” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు ‘ఓజీ’ సినిమాపై నినాదాలు చేశారు. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ చిరాకు ప్రదర్శించారు. “సరదా కోసం సినిమా ఉండాలి. కానీ, ఆ సినిమా చూడాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలి. సినిమా పేర్లతో అరిచే బదులు భగవంతుని నామస్మరణ చేయండి. దేవుడిని తలుచుకుంటే.. అద్భుతాలు జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు. భక్తులకు అండగా నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతగా ఉండాలనేది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ కూడా నిబద్ధతతో ఉందని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమయింది కాబట్టే..తాను దీక్ష చేపట్టినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…