Political News

జగన్ కు కార్యకర్తల అవసరం లేదు: వాసిరెడ్డి పద్మ

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కు వరుసగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వంటి కీలక నేతలతో పాటు పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు వైసిపి మహిళా నేత భారీ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు.

ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడంలో, పరిపాలన చేయడంలో, సమాజంపై జగన్ కు అసలు బాధ్యత లేదని విమర్శలు గుప్పించారు. పార్టీలో కష్టపడ్డ వారి కోసం గుడ్ బుక్, ప్రమోషన్లు అని జగన్ అంటున్నారని, కానీ, నాయకులు, కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాకుండా గుండె బుక్ ఉండాలని పద్మ అన్నారు. ప్రమోషన్లు ఇవ్వడానికి వైసిపి వ్యాపార కంపెనీ కాదని ఎద్దేవా చేశారు. జీవితాలు, ప్రాణాలు పణంగా పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే వ్యక్తి జగన్ అని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఇక, గుడ్ బుక్ పేరుతో మరోసారి కార్యకర్తలను, నేతలను మోసం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. నియంత ధోరణి ఉన్న నేతను ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. వ్యక్తిగతంగా, విధానపరంగా వైసీపీలో చాలాసార్లు అసంతృప్తికి గురైనప్పటికీ నిబద్ధతగలిగిన వ్యక్తిగా పార్టీ కోసం పని చేశానని చెప్పుకొచ్చారు. అయితే, ప్రజా తీర్పు తర్వాత ఎన్నో విషయాలను సమీక్షించుకున్నానని, ఆ తర్వాతే వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నానని పద్మ అన్నారు.

పార్టీని వీడిన తర్వాత జగన్ పై ఈ స్థాయిలో విమర్శలు గుప్పించిన నేత మరొకరు లేకపోవడం విశేషం. ఈ నేపద్యంలోని పద్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పద్మ అసంతృప్తికి గురయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు.

This post was last modified on October 23, 2024 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మంత్రుల పై చంద్రబాబు సీరియస్..రీజనిదే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక…

43 mins ago

ఏపీపీఎస్సీ చైర్ ప‌ర్స‌న్‌గా మాజీ ఐపీఎస్ అనురాధ‌.. ఏంటి స్పెష‌ల్‌!

ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల‌కు కీల‌క‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(ఏపీపీఎస్సీ) చైర్ ప‌ర్స‌న్‌గా ఇటీవ‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఐపీఎస్…

49 mins ago

లోకేష్‌ను మరో సారి పప్పు అన్న జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. మంత్రి నారా లోకేష్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్‌ను ప‌ప్పు అంటార‌ని..…

50 mins ago

బాహుబలి బరువు మోస్తున్న కంగువ

అదేంటి ప్రభాస్ సినిమాకు సూర్య మూవీకి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మ్యాటర్. నవంబర్ 14 విడుదల కాబోతున్న…

2 hours ago

పేట వైసీపీలో కొట్లాట‌.. ఆమె చుట్టూనే అస‌లు రాజ‌కీయం!

గుంటూరు జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరిపేట‌. ఇక్క‌డ రాజ‌కీయాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో…

3 hours ago

సలార్ 2 సౌండ్ లేదు ఎందుకు

ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినిమాలు తీస్తున్న, తీయబోతున్న నిర్మాణ సంస్థల నుంచి మంచి అప్డేట్స్ ఆశించారు అభిమానులు.…

3 hours ago