Political News

జగన్ కు కార్యకర్తల అవసరం లేదు: వాసిరెడ్డి పద్మ

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కు వరుసగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వంటి కీలక నేతలతో పాటు పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు వైసిపి మహిళా నేత భారీ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు.

ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడంలో, పరిపాలన చేయడంలో, సమాజంపై జగన్ కు అసలు బాధ్యత లేదని విమర్శలు గుప్పించారు. పార్టీలో కష్టపడ్డ వారి కోసం గుడ్ బుక్, ప్రమోషన్లు అని జగన్ అంటున్నారని, కానీ, నాయకులు, కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాకుండా గుండె బుక్ ఉండాలని పద్మ అన్నారు. ప్రమోషన్లు ఇవ్వడానికి వైసిపి వ్యాపార కంపెనీ కాదని ఎద్దేవా చేశారు. జీవితాలు, ప్రాణాలు పణంగా పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే వ్యక్తి జగన్ అని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఇక, గుడ్ బుక్ పేరుతో మరోసారి కార్యకర్తలను, నేతలను మోసం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. నియంత ధోరణి ఉన్న నేతను ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. వ్యక్తిగతంగా, విధానపరంగా వైసీపీలో చాలాసార్లు అసంతృప్తికి గురైనప్పటికీ నిబద్ధతగలిగిన వ్యక్తిగా పార్టీ కోసం పని చేశానని చెప్పుకొచ్చారు. అయితే, ప్రజా తీర్పు తర్వాత ఎన్నో విషయాలను సమీక్షించుకున్నానని, ఆ తర్వాతే వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నానని పద్మ అన్నారు.

పార్టీని వీడిన తర్వాత జగన్ పై ఈ స్థాయిలో విమర్శలు గుప్పించిన నేత మరొకరు లేకపోవడం విశేషం. ఈ నేపద్యంలోని పద్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పద్మ అసంతృప్తికి గురయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు.

This post was last modified on October 23, 2024 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago