బాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ మూవీ.. సింగమ్ అగైన్. తమిళ చిత్రం ‘సింగమ్’కు రీమేక్గా అజయ్ గేదవగణ్ హీరోగా అదే పేరుతో తెరకెక్కిన సినిమా గతంలో సూపర్ హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా ‘సింగమ్ రిటర్న్స్’ తీశాడు రోహిత్ శెట్టి. అది కూడా విజయం సాధించడంతో ‘సింగమ్ అగైన్’ అంటూ మరో సినిమా రూపొందించారు. ఈసారి ‘సింగమ్’ కోసం చాలామంది స్టార్లను తీసుకొచ్చారు.
అజయ్ దేవగణ్ సరసన కరీనా కపూర్ నటించగా.. రోహిత్ తీసిన వేర్వేరు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేసిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు టైగర్ ష్రాఫ్, విక్కీ కౌశల్ ఇందులో స్పెషల్ క్యామియోలు చేశారు. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్లో వీళ్లంతా సందడి చేశారు. కానీ ఈ క్యామియోలు ఓవర్ ద టాప్గా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి.
కానీ రోహిత్ మాత్రం సినిమాకు క్యామియోలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాడు. ఐతే ఇంతమంది ఉన్నా సరిపోరంటూ.. ట్రైలర్లో కనిపించని ఇంకో టాప్ స్టార్ క్యామియోను కూడా సినిమాకు జోడిస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడితో రోహిత్కు మంచి అనుబంధమే ఉంది. సల్మాన్ కెరీర్లో బిగ్ హిట్స్లో ఒకటిగా నిలిచిన ‘దబంగ్’లో చుల్ బుల్ పాండే పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అదే పాత్రను ‘సింగమ్ అగైన్’ కోసం వాడుకుంటున్నారు.
ఇటీవల తనను హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ కొన్ని రోజులు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. తర్వాత ‘బిగ్ బాస్’ కోసం బయటికి వచ్చాడు. ఇప్పుడు ‘సింగమ్ అగైన్’ షూట్లోనూ పాల్గొంటున్నాడట సల్మాన్. సల్మాన్ పార్ట్ పది రోజుల ముందే షూట్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనుకున్నారు. కానీ సల్మాన్ బ్రేక్ తీసుకోవడంతో అది అలాగే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడు ఆ పని పూర్తి చేస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 1న ‘సింగమ్ అగైన్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 23, 2024 11:19 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…