Political News

నా చెల్లి మోసం చేసింది: ష‌ర్మిల‌, విజ‌యమ్మ‌ల‌పై జ‌గ‌న్ పిటిష‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, త‌న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. హైదరాబాద్‌లోని నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ఆయ‌న పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌ను ‘మోసం’ చేశారంటూ.. ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

విష‌యం ఇదీ..

బెంగ‌ళూరులో ఉన్న స‌రస్వ‌తీ ప‌వ‌ర్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తాను ప్రేమ కొద్దీ త‌న మాతృమూర్తి విజ‌య రాజ‌శేఖ‌ర‌రెడ్డికి 48.99 శాతం షేర్లు ఇచ్చిన‌ట్టు తెలిపారు. దీనిలో 29.88% షేర్లు త‌న‌పేరుపై ఉన్నాయ‌ని, మ‌రో 16.33 % షేర్లు భార‌తి పేరుతో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు విజ‌య రాజ‌శేఖ‌ర రెడ్డి పేరుతో ఉన్న షేర్ల‌ను మోస పూరితంగా, కుట్ర పూరితంగా ష‌ర్మిల స్వాధీనం చేసుకున్నార‌ని తెలిపా రు.

ష‌ర్మిల‌కు షేర్లు బ‌ద‌లాయించే ఉద్దేశం త‌న‌కు లేద‌ని పిటిష‌న్‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు. అయినా.. మోసం, కుట్ర పూరితంగా త‌న త‌ల్లికి కేటాయించిన షేర్ల‌ను ష‌ర్మిల తీసుకుంద‌ని వివ‌రించారు. దీనివ‌ల్ల‌.. కంపెనీ పై త‌మ ఆధిప‌త్యం పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు 51.01% షేర్ల‌ను ఇచ్చేలా చూడాల‌ని ట్రైబ్యున‌ల్‌కు విన్న‌వించారు.

2019లో ష‌ర్మిల‌కు తోడ‌బుట్టిన సోద‌రిగా కొన్ని షేర్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. అయితే.. ఆమె రాజ‌కీయంగా విభేదాలు పెట్టుకున్న నేప‌థ్యంలో త‌మ నుంచి దూర‌మైంద‌ని.. అందుకే.. ఆమెకు షేర్లు కేటాయించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో విచారించి.. త‌మ‌కు 51.01 శాతం షేర్లు ల‌భించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. కాగా, ఈ కేసు గ‌త నెల‌లోనే ఫైల్ అయింది. ఆల‌స్యంగా వెలుగు చూసింది.

This post was last modified on October 23, 2024 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

18 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago