Political News

నా చెల్లి మోసం చేసింది: ష‌ర్మిల‌, విజ‌యమ్మ‌ల‌పై జ‌గ‌న్ పిటిష‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, త‌న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. హైదరాబాద్‌లోని నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ఆయ‌న పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌ను ‘మోసం’ చేశారంటూ.. ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

విష‌యం ఇదీ..

బెంగ‌ళూరులో ఉన్న స‌రస్వ‌తీ ప‌వ‌ర్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తాను ప్రేమ కొద్దీ త‌న మాతృమూర్తి విజ‌య రాజ‌శేఖ‌ర‌రెడ్డికి 48.99 శాతం షేర్లు ఇచ్చిన‌ట్టు తెలిపారు. దీనిలో 29.88% షేర్లు త‌న‌పేరుపై ఉన్నాయ‌ని, మ‌రో 16.33 % షేర్లు భార‌తి పేరుతో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు విజ‌య రాజ‌శేఖ‌ర రెడ్డి పేరుతో ఉన్న షేర్ల‌ను మోస పూరితంగా, కుట్ర పూరితంగా ష‌ర్మిల స్వాధీనం చేసుకున్నార‌ని తెలిపా రు.

ష‌ర్మిల‌కు షేర్లు బ‌ద‌లాయించే ఉద్దేశం త‌న‌కు లేద‌ని పిటిష‌న్‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు. అయినా.. మోసం, కుట్ర పూరితంగా త‌న త‌ల్లికి కేటాయించిన షేర్ల‌ను ష‌ర్మిల తీసుకుంద‌ని వివ‌రించారు. దీనివ‌ల్ల‌.. కంపెనీ పై త‌మ ఆధిప‌త్యం పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు 51.01% షేర్ల‌ను ఇచ్చేలా చూడాల‌ని ట్రైబ్యున‌ల్‌కు విన్న‌వించారు.

2019లో ష‌ర్మిల‌కు తోడ‌బుట్టిన సోద‌రిగా కొన్ని షేర్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. అయితే.. ఆమె రాజ‌కీయంగా విభేదాలు పెట్టుకున్న నేప‌థ్యంలో త‌మ నుంచి దూర‌మైంద‌ని.. అందుకే.. ఆమెకు షేర్లు కేటాయించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో విచారించి.. త‌మ‌కు 51.01 శాతం షేర్లు ల‌భించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. కాగా, ఈ కేసు గ‌త నెల‌లోనే ఫైల్ అయింది. ఆల‌స్యంగా వెలుగు చూసింది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

5 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

9 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

10 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

10 hours ago