వైసీపీ అధినేత జగన్.. తన తల్లి విజయమ్మ, తన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనను ‘మోసం’ చేశారంటూ.. ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
విషయం ఇదీ..
బెంగళూరులో ఉన్న సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో తాను ప్రేమ కొద్దీ తన మాతృమూర్తి విజయ రాజశేఖరరెడ్డికి 48.99 శాతం షేర్లు ఇచ్చినట్టు తెలిపారు. దీనిలో 29.88% షేర్లు తనపేరుపై ఉన్నాయని, మరో 16.33 % షేర్లు భారతి పేరుతో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు విజయ రాజశేఖర రెడ్డి పేరుతో ఉన్న షేర్లను మోస పూరితంగా, కుట్ర పూరితంగా షర్మిల స్వాధీనం చేసుకున్నారని తెలిపా రు.
షర్మిలకు షేర్లు బదలాయించే ఉద్దేశం తనకు లేదని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. అయినా.. మోసం, కుట్ర పూరితంగా తన తల్లికి కేటాయించిన షేర్లను షర్మిల తీసుకుందని వివరించారు. దీనివల్ల.. కంపెనీ పై తమ ఆధిపత్యం పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో తమకు 51.01% షేర్లను ఇచ్చేలా చూడాలని ట్రైబ్యునల్కు విన్నవించారు.
2019లో షర్మిలకు తోడబుట్టిన సోదరిగా కొన్ని షేర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే.. ఆమె రాజకీయంగా విభేదాలు పెట్టుకున్న నేపథ్యంలో తమ నుంచి దూరమైందని.. అందుకే.. ఆమెకు షేర్లు కేటాయించకూడదని నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో విచారించి.. తమకు 51.01 శాతం షేర్లు లభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, ఈ కేసు గత నెలలోనే ఫైల్ అయింది. ఆలస్యంగా వెలుగు చూసింది.
This post was last modified on October 23, 2024 11:57 am
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…