వైసీపీ నుంచి నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. సాధారణం నుంచి కీలకనాయకుల వరకు కూడా చాలా మంది క్యూకట్టుకుని మరీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో .. కీలక నేత, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కూడా చేరిపోతున్నట్టు తెలిసింది. తాజాగా జోగి అనుచరులకు చెందిన సోషల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడహో!’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. “ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పార్టీలోకి మా అన్నమారుతున్నాడు” అని జోగి అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
దీంతో జోగి రమేష్.. కుటుంబ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్తో రాజకీయాలు ప్రారంభించిన జోగి.. వైసీపీ హయాంలో మంత్రి అయ్యారు. అయితే.. దీనికి ముందు ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, ఇప్పుడు ఆ కేసు విచారణ పుంజుకుంది.
మరోవైపు.. జోగి కుమారుడు.. జోగి రాజీవ్.. అగ్రిగోల్డ్ భూముల కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లు జైల్లో ఉండడం.. ఇటీవల బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జోగి రమేష్ యూటర్న్ తీసుకోవడం.. వైసీపీకి గుడ్ బై చెబుతున్నారన్న సమాచారం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వైసీపీకి, ముఖ్యంగా జగన్కు నమ్మిన బంటుగా ఉన్న జోగి రమేష్.. జగన్ ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు.
కేసులు నమోదైనప్పుడు కూడా.. జోగి పార్టీని, జగన్ను కూడా వెనుకేసుకు వచ్చారు. అయితే, ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుండడం.. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిని అరెస్టు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మార్పు దిశగా జోగి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరగడం సంచలనంగా మారింది. పార్టీ మారాల్సి వస్తే.. జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాదు.. తాను గతంలో చేసిన అన్ని పనులను వైసీపీ పెద్దలు చెబితేనే చేశానని చెప్పుకొనే అవకాశం కూడా కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 20, 2024 10:53 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…