Political News

ముద్ర‌గ‌డ గురించి గొప్పగా మాట్లాడిన పవన్

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, వైసీపీ నేత‌.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం(రెడ్డి) కుమార్తె ముద్ర‌గ‌డ‌ క్రాంతి తాజాగా జ‌న‌సేన తీర్థం పుచ్చు కున్నారు. పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆమె జ‌న‌సేన కండువా క‌ప్పుకొని.. ఆ పార్టీలో చేరారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క్రాంతితోపాటు.. గుంటూరు కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఇద్దరు వైసీపీ కార్పొరేట‌ర్లు కూడా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య పేట‌కు చెందిన మునిసిప‌ల్ కౌన్సిల‌ర్లు.. న‌లుగురు కూడా ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు.

వీరంతా ఆయా జిల్లాల‌కు చెందిన కీల‌క నేత‌లతో క‌లిసి మంగ‌ళగిరిలోని జ‌న‌సేన కార్యాల‌యానికి వ‌చ్చారు. అనంత‌రం.. ప‌వ‌న్ వారిని సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పిఠాపు రం నియోజ‌క‌వ‌ర్గంలో క్రాంతి త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారం చేశార‌ని అన్నారు.

ఆమె ధైర్యానికి, సాహ‌సానికి తాను ఫిదా అయిన ట్టు చెప్పారు. “క్రాంతి ఏమీ.. సామాన్య వ్య‌క్తికాదు. ఆమె తండ్రి దిగ్గ‌జ నాయ‌కుడు. అలాంటి నాయ‌కుడైన తండ్రిని కూడా ఎదిరించి.. మంచి కోసం.. నిజాయితీ కోసం నిల‌బ‌డ‌డం అంటే.. మాట‌లు కాదు. ఆమెను ఆరోజే నేను మ‌న‌స్పూర్తిగా అభినందించా” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ముద్ర‌గ‌డ క్రాంతికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ప‌వ‌న్ తెలిపారు. ఇక‌, ఎన్టీఆర్ జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వాహ‌క అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఇటీవ‌ల జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన సామినేని ఉద‌య భానుకు అప్ప‌గిస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

సామినేని వంటి సీనియ‌ర్ నాయ‌కుడి చేతిలో ఎన్టీఆర్ జిల్లా జ‌న‌సేన బాధ్య‌త‌లు పెడుతున్న‌ట్టు తెలిపారు. పార్టీని అన్ని కోణాల్లోనూ అభివృద్ది చేయాల‌ని ఆయ‌న‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పార్టీని విస్త‌రించాల‌ని ఉన్నా.. నాయ‌కుల కోసం ఎదురు చూస్తున్నామ‌ని.. ఇలాంటి స‌మ‌యంలో బ‌ల‌మైన నాయ‌కులు రావ‌డం.. వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం పార్టీ అభివృద్ధికి దోహ ద ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on October 20, 2024 10:58 am

Share

Recent Posts

పొలిమేరలో అర్జున్ అడుగు పెద్ద ప్లస్సు

హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…

33 minutes ago

సెప్టెంబర్ 11 – ఇంత రష్ అయితే ఎలా

ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…

43 minutes ago

ధనుష్ మీటింగ్… చాలా కథ ఉంది

తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…

54 minutes ago

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

2 hours ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

5 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

6 hours ago