Political News

‘వైసీపీ స్వామి’కి.. చంద్ర‌బాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!!

వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శార‌దా పీఠాధిప‌తి.. స్వామి స్వ‌రూపానందేంద్ర‌కు కూట‌మి ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాల‌కు సంబంధించి స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. 1) భూములు ర‌ద్దు. 2) తిరుమ‌ల‌లో క‌డుతున్న భ‌వ‌నాల త‌నిఖీ. ఈ రెండు అంశాల‌ను కూడా ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. విశాఖ‌లో శార‌దా పీఠం ఉన్న నేప‌థ్యంలో దీనిని విస్త‌రించేందుకుగాను.. గ‌త వైసీపీ హ‌యాంలో భీమిలి వ‌ద్ద‌.. 15 ఎక‌రాల‌ను స్వామి పీఠం తీసుకుంది. అయితే.. మార్కెట్ వాల్యూ కంటే చీప్‌గా దీనిని అప్ప‌గించార‌న్న అభియోగాలు ఉన్నాయి.

మార్కెట్ ధ‌ర ఎక‌రాకు రూ.15 కోట్లు ఉంటే.. ప్ర‌భుత్వ ధ‌ర రూ.2 కోట్ల‌కు అటు ఇటుగా ఉంది. అయితే.. వైసీపీ హ‌యాంలో స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించిన అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. శార‌దా పీఠానికి కేటాయించిన 15 ఎక‌రాల‌ను కూడా ఒక్కొక్క ఎక‌రం రూ.ల‌క్ష చొప్పున కేటాయించారు. దీంతో అప్ప‌టి నుంచి ఈ వివాదంపై టీడీపీ నాయ‌కులు త‌ర‌చుగా స్పందిస్తూనే ఉన్నారు. విశాఖ నాయ‌కులు ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. అయినా.. జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు కేటాయించాం కాబ‌ట్టి.. త‌ప్పులేద‌ని స‌మ‌ర్థించింది. ఇక‌, తాజాగా ఆ భూముల కేటాయింపును ర‌ద్దుచేస్తూ.. చంద్ర‌బాబుస‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

అయితే.. స‌ర్కారు నిర్ణ‌యంపై మ‌ఠం హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలిసింది. ఒక‌సారి కేటాయింపు జ‌రిగిన త‌ర్వాత‌.. తాము రిజిస్ట్రేష‌న్ సొమ్మును కూడా చెల్లించిన త‌ర్వాత‌.. ర‌ద్దు చేయ‌డం కుద‌ర‌ద‌న్న‌ది మ‌ఠం తాలూకు న్యాయ‌వాదులు చెబుతున్న మాట‌. దీనిపై తాము హైకోర్టును ఆశ్ర‌యించి న్యాయ పోరాటం చేస్తామ‌ని చెబుతున్నారు. ఇక‌, 2వ విష‌యాన్ని చూస్తే.. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన తిరుమ‌ల కొండ‌పై ఇదే శార‌దా పీఠానికి బూములు కేటాయించారు. అప్ప‌ట్లో వైవీ సుబ్బారెడ్డి బోర్డు చైర్మ‌న్‌గా ఉన్నారు.

బేడీ ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి చేరువ‌లో కేటాయించిన భూమిలో శార‌దా పీఠం నిర్మాణాలు కూడా చేస్తోంది. అయితే.. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు వాటి నిగ్గు కూడా తేల్చాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు ఆదేశించింది. ఈ బాధ్య‌త‌ల‌ను టీటీడీ ఈవో జె. శ్యామ‌ల‌రావుకు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని, నిర్మాణాలు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంటే కూల్చేయాల‌ని ఆదేశించింది.

This post was last modified on October 20, 2024 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

1 hour ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

5 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

5 hours ago