వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామి స్వరూపానందేంద్రకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాలకు సంబంధించి సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 1) భూములు రద్దు. 2) తిరుమలలో కడుతున్న భవనాల తనిఖీ. ఈ రెండు అంశాలను కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విశాఖలో శారదా పీఠం ఉన్న నేపథ్యంలో దీనిని విస్తరించేందుకుగాను.. గత వైసీపీ హయాంలో భీమిలి వద్ద.. 15 ఎకరాలను స్వామి పీఠం తీసుకుంది. అయితే.. మార్కెట్ వాల్యూ కంటే చీప్గా దీనిని అప్పగించారన్న అభియోగాలు ఉన్నాయి.
మార్కెట్ ధర ఎకరాకు రూ.15 కోట్లు ఉంటే.. ప్రభుత్వ ధర రూ.2 కోట్లకు అటు ఇటుగా ఉంది. అయితే.. వైసీపీ హయాంలో స్వామి భక్తి ప్రదర్శించిన అప్పటి సీఎం జగన్.. శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను కూడా ఒక్కొక్క ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయించారు. దీంతో అప్పటి నుంచి ఈ వివాదంపై టీడీపీ నాయకులు తరచుగా స్పందిస్తూనే ఉన్నారు. విశాఖ నాయకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా.. జగన్ సర్కారు మాత్రం ధార్మిక కార్యక్రమాలకు కేటాయించాం కాబట్టి.. తప్పులేదని సమర్థించింది. ఇక, తాజాగా ఆ భూముల కేటాయింపును రద్దుచేస్తూ.. చంద్రబాబుసర్కారు నిర్ణయం తీసుకుంది.
అయితే.. సర్కారు నిర్ణయంపై మఠం హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. ఒకసారి కేటాయింపు జరిగిన తర్వాత.. తాము రిజిస్ట్రేషన్ సొమ్మును కూడా చెల్లించిన తర్వాత.. రద్దు చేయడం కుదరదన్నది మఠం తాలూకు న్యాయవాదులు చెబుతున్న మాట. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇక, 2వ విషయాన్ని చూస్తే.. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుమల కొండపై ఇదే శారదా పీఠానికి బూములు కేటాయించారు. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్గా ఉన్నారు.
బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరువలో కేటాయించిన భూమిలో శారదా పీఠం నిర్మాణాలు కూడా చేస్తోంది. అయితే.. నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటి నిగ్గు కూడా తేల్చాలని చంద్రబాబు సర్కారు ఆదేశించింది. ఈ బాధ్యతలను టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు అప్పగించడం గమనార్హం. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయాలని ఆదేశించింది.
This post was last modified on October 20, 2024 11:21 am
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…