Political News

బీజేపీ మౌత్ పీస్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక‌, బీజేపీకి మౌత్ పీస్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగ‌ఢ్‌లో జ‌రిగిన ఎన్డీయే కూట‌మి నాయ‌కుల స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు ప‌వ‌న్‌తో చ‌ర్చించారు. ఏపీలో ఆయ‌న స‌నాత‌న ధ‌ర్మం ప‌రిర‌క్ష‌కుడిగా ఉంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న ద‌రిమిలా.. హిందూ స‌మాజం ఆయ‌న‌తో ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ హిందూత్వ‌కు.. ప‌వ‌న్ చెప్పిన స‌నాత‌న ధ‌ర్మానికి మ‌ధ్య మంచి లింకు ఉండ‌డంతో ప‌వ‌న్ సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు బీజేపీ ప‌క్కా ప్లాన్‌తోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటిలో మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ ఉన్నాయి. అయితే.. జార్ఖండ్ సంగ‌తి తాము చూసుకుంటామ‌ని.. మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి మౌత్ పీస్‌గా ఉండాల‌ని ప‌వ‌న్‌ను కోరిన‌ట్టు స‌మాచారం.

దీనికి కూడా కార‌ణం ఉంది.. మ‌హారాష్ట్రంలో పెద్ద యుద్ధ‌మే జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ బీజేపీ పుంజుకుని అధికారం ద‌క్కించుకోక‌పోతే.. 2022లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. త‌ర్వాత జ‌రిగిన స‌మీక‌ర‌ణ‌లు వంటి విష‌యంలో బీజేపీ అభాసుపాల‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఇక్క‌డ గెలుపును క‌మ‌ల నాధులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో బీజేపీ నేతృత్వంలోని శివ‌సేన‌, నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లు ‘మ‌హాయుతి'(అతి పెద్ద కూట‌మి)గా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తున్నాయి.

అయితే.. శివ‌సేన‌(సీఎం ఏక్‌నాథ్ వ‌ర్గం), ఎన్సీపీ(డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వ‌ర్గం) రెండూ కూడా.. చీలిక పార్టీలు. ప్ర‌ధాన పార్టీలైన శివ‌సేన‌, ఎన్సీపీల నుంచి విడిపోయి.. విడివిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీటి మ‌నుగ‌డ కూడా ఎన్నిక‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉంది. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి 105 సీట్లు ద‌క్కాయి.

ఇప్పుడు ఈ సంఖ్యను 150కి చేర్చ‌డంతోపాటు.. మ‌రోసారి మ‌హాయుతి ప్ర‌భుత్వం కొలువుదీరాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. దీంతో ప‌వ‌న్ వంటి వారిని రంగంలోకి దింపి.. హిందూ సెంటిమెంటునుత‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌చార బాధ్య‌త‌ల్లో ప‌వ‌న్‌కు కీల‌క భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌న్న‌ది క‌మ‌ల నాథుల ఆలోచ‌న. దీనికి ప‌వ‌న్ వెళ్తారా? వెళ్ల‌రా? అనేది చూడాలి.

This post was last modified on October 18, 2024 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

12 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

48 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago