Political News

బీజేపీ మౌత్ పీస్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక‌, బీజేపీకి మౌత్ పీస్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగ‌ఢ్‌లో జ‌రిగిన ఎన్డీయే కూట‌మి నాయ‌కుల స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు ప‌వ‌న్‌తో చ‌ర్చించారు. ఏపీలో ఆయ‌న స‌నాత‌న ధ‌ర్మం ప‌రిర‌క్ష‌కుడిగా ఉంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న ద‌రిమిలా.. హిందూ స‌మాజం ఆయ‌న‌తో ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ హిందూత్వ‌కు.. ప‌వ‌న్ చెప్పిన స‌నాత‌న ధ‌ర్మానికి మ‌ధ్య మంచి లింకు ఉండ‌డంతో ప‌వ‌న్ సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు బీజేపీ ప‌క్కా ప్లాన్‌తోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటిలో మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ ఉన్నాయి. అయితే.. జార్ఖండ్ సంగ‌తి తాము చూసుకుంటామ‌ని.. మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి మౌత్ పీస్‌గా ఉండాల‌ని ప‌వ‌న్‌ను కోరిన‌ట్టు స‌మాచారం.

దీనికి కూడా కార‌ణం ఉంది.. మ‌హారాష్ట్రంలో పెద్ద యుద్ధ‌మే జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ బీజేపీ పుంజుకుని అధికారం ద‌క్కించుకోక‌పోతే.. 2022లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. త‌ర్వాత జ‌రిగిన స‌మీక‌ర‌ణ‌లు వంటి విష‌యంలో బీజేపీ అభాసుపాల‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఇక్క‌డ గెలుపును క‌మ‌ల నాధులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో బీజేపీ నేతృత్వంలోని శివ‌సేన‌, నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లు ‘మ‌హాయుతి'(అతి పెద్ద కూట‌మి)గా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తున్నాయి.

అయితే.. శివ‌సేన‌(సీఎం ఏక్‌నాథ్ వ‌ర్గం), ఎన్సీపీ(డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వ‌ర్గం) రెండూ కూడా.. చీలిక పార్టీలు. ప్ర‌ధాన పార్టీలైన శివ‌సేన‌, ఎన్సీపీల నుంచి విడిపోయి.. విడివిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీటి మ‌నుగ‌డ కూడా ఎన్నిక‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉంది. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి 105 సీట్లు ద‌క్కాయి.

ఇప్పుడు ఈ సంఖ్యను 150కి చేర్చ‌డంతోపాటు.. మ‌రోసారి మ‌హాయుతి ప్ర‌భుత్వం కొలువుదీరాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. దీంతో ప‌వ‌న్ వంటి వారిని రంగంలోకి దింపి.. హిందూ సెంటిమెంటునుత‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌చార బాధ్య‌త‌ల్లో ప‌వ‌న్‌కు కీల‌క భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌న్న‌ది క‌మ‌ల నాథుల ఆలోచ‌న. దీనికి ప‌వ‌న్ వెళ్తారా? వెళ్ల‌రా? అనేది చూడాలి.

This post was last modified on October 18, 2024 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంత చేయనని చెప్పినా వదల్లేదు

టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె…

55 mins ago

వైవీ పోయి సాయిరెడ్డి వ‌చ్చే.. !

ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విష‌యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న మార్పు చేశారు. గ‌తంలో ఉన్న‌ట్టుగానే…

2 hours ago

జపాన్ దేశంలో RRR మెంటల్ మాస్ రికార్డు

థియేటర్లలో రిలీజై రెండేళ్లు దాటిపోయింది కాబట్టి ఏదో టీవీలో వచ్చినప్పుడో, యూట్యూబ్ లో క్లిప్పులు చూసినప్పుడో తప్ప ఆర్ఆర్ఆర్ ని…

2 hours ago

గేమ్ చేంజర్ OTT రచ్చ వెనుక జరిగిందేంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో…

3 hours ago

అఖిల్ తిరుపతి బ్యాక్ డ్రాప్.. రంగంలోకి నాగ్!

అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై…

4 hours ago

వైసీపీ నుంచి పోయేవాళ్లే కాదు.. వ‌చ్చేవాళ్లూ ఉన్నారా?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి చాలా మంది నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూక‌ట్టుకుని మ‌రీ నాయకులు పార్టీకి…

4 hours ago