Political News

బీజేపీ మౌత్ పీస్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక‌, బీజేపీకి మౌత్ పీస్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగ‌ఢ్‌లో జ‌రిగిన ఎన్డీయే కూట‌మి నాయ‌కుల స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు ప‌వ‌న్‌తో చ‌ర్చించారు. ఏపీలో ఆయ‌న స‌నాత‌న ధ‌ర్మం ప‌రిర‌క్ష‌కుడిగా ఉంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న ద‌రిమిలా.. హిందూ స‌మాజం ఆయ‌న‌తో ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ హిందూత్వ‌కు.. ప‌వ‌న్ చెప్పిన స‌నాత‌న ధ‌ర్మానికి మ‌ధ్య మంచి లింకు ఉండ‌డంతో ప‌వ‌న్ సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు బీజేపీ ప‌క్కా ప్లాన్‌తోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటిలో మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ ఉన్నాయి. అయితే.. జార్ఖండ్ సంగ‌తి తాము చూసుకుంటామ‌ని.. మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి మౌత్ పీస్‌గా ఉండాల‌ని ప‌వ‌న్‌ను కోరిన‌ట్టు స‌మాచారం.

దీనికి కూడా కార‌ణం ఉంది.. మ‌హారాష్ట్రంలో పెద్ద యుద్ధ‌మే జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ బీజేపీ పుంజుకుని అధికారం ద‌క్కించుకోక‌పోతే.. 2022లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. త‌ర్వాత జ‌రిగిన స‌మీక‌ర‌ణ‌లు వంటి విష‌యంలో బీజేపీ అభాసుపాల‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఇక్క‌డ గెలుపును క‌మ‌ల నాధులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో బీజేపీ నేతృత్వంలోని శివ‌సేన‌, నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లు ‘మ‌హాయుతి'(అతి పెద్ద కూట‌మి)గా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తున్నాయి.

అయితే.. శివ‌సేన‌(సీఎం ఏక్‌నాథ్ వ‌ర్గం), ఎన్సీపీ(డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వ‌ర్గం) రెండూ కూడా.. చీలిక పార్టీలు. ప్ర‌ధాన పార్టీలైన శివ‌సేన‌, ఎన్సీపీల నుంచి విడిపోయి.. విడివిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీటి మ‌నుగ‌డ కూడా ఎన్నిక‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉంది. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి 105 సీట్లు ద‌క్కాయి.

ఇప్పుడు ఈ సంఖ్యను 150కి చేర్చ‌డంతోపాటు.. మ‌రోసారి మ‌హాయుతి ప్ర‌భుత్వం కొలువుదీరాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. దీంతో ప‌వ‌న్ వంటి వారిని రంగంలోకి దింపి.. హిందూ సెంటిమెంటునుత‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌చార బాధ్య‌త‌ల్లో ప‌వ‌న్‌కు కీల‌క భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌న్న‌ది క‌మ‌ల నాథుల ఆలోచ‌న. దీనికి ప‌వ‌న్ వెళ్తారా? వెళ్ల‌రా? అనేది చూడాలి.

This post was last modified on October 18, 2024 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago