జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, బీజేపీకి మౌత్ పీస్గా మారనున్నారనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగఢ్లో జరిగిన ఎన్డీయే కూటమి నాయకుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలు పవన్తో చర్చించారు. ఏపీలో ఆయన సనాతన ధర్మం పరిరక్షకుడిగా ఉంటానని చేసిన ప్రకటన దరిమిలా.. హిందూ సమాజం ఆయనతో ఉన్నట్టు తాము గుర్తించామని కూడా చెప్పినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ హిందూత్వకు.. పవన్ చెప్పిన సనాతన ధర్మానికి మధ్య మంచి లింకు ఉండడంతో పవన్ సేవలను వినియోగించుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్తోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్న ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. వీటిలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఉన్నాయి. అయితే.. జార్ఖండ్ సంగతి తాము చూసుకుంటామని.. మహారాష్ట్రలో బీజేపీకి మౌత్ పీస్గా ఉండాలని పవన్ను కోరినట్టు సమాచారం.
దీనికి కూడా కారణం ఉంది.. మహారాష్ట్రంలో పెద్ద యుద్ధమే జరగనుంది. ఇక్కడ బీజేపీ పుంజుకుని అధికారం దక్కించుకోకపోతే.. 2022లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. తర్వాత జరిగిన సమీకరణలు వంటి విషయంలో బీజేపీ అభాసుపాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ గెలుపును కమల నాధులు సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లు ‘మహాయుతి'(అతి పెద్ద కూటమి)గా ఏర్పడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి.
అయితే.. శివసేన(సీఎం ఏక్నాథ్ వర్గం), ఎన్సీపీ(డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం) రెండూ కూడా.. చీలిక పార్టీలు. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల నుంచి విడిపోయి.. విడివిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీటి మనుగడ కూడా ఎన్నికలపైనే ఆధారపడి ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు దక్కాయి.
ఇప్పుడు ఈ సంఖ్యను 150కి చేర్చడంతోపాటు.. మరోసారి మహాయుతి ప్రభుత్వం కొలువుదీరాలనే సంకల్పంతో ఉన్నారు. దీంతో పవన్ వంటి వారిని రంగంలోకి దింపి.. హిందూ సెంటిమెంటునుతమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచార బాధ్యతల్లో పవన్కు కీలక భాగస్వామ్యం కల్పించాలన్నది కమల నాథుల ఆలోచన. దీనికి పవన్ వెళ్తారా? వెళ్లరా? అనేది చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…