అధికారిక ప్రకటన లేదన్న మాటే కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి, విశ్వంభర వేసవికి వాయిదా పడినట్టేనని డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరి దూరంలో ఉన్నా థియేటర్లను అగ్రిమెంట్ చేసుకునే వ్యవహారాలు రెండు మూడు నెలల ముందే మొదలవుతాయి. దిల్ రాజు తన సర్కిల్లో ఉన్న బయ్యర్లకు ఎస్విసి బ్యానర్ లో రూపొందుతున్న రామ్ చరణ్, వెంకటేష్ సినిమాలు పండక్కి వస్తాయని, ఆ మేరకు ఏర్పాట్లలో ఉండమని చూచాయగా చెప్పారట.
వీలైతే దసరాకు అనౌన్స్ మెంట్లు వస్తాయని లేదా ఒకటి రెండు వారాల్లో ఆ లాంఛనం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నట్టు వినికిడి. సరే గేమ్ ఛేంజర్ కు మంచి సీజన్ దొరికిందని ఫ్యాన్స్ సంబరపడ్డా అసలు ఛాలెంజ్ విశ్వంభరకు ఉంటుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ విజువల్ వండర్ కు వీలైనంత సోలో డేట్ కావాలి. మార్చి చివరి వారం దానికి అనుకూలంగా ఉంటుంది. అయితే హరిహర వీరమల్లు ఆల్రెడీ అఫీషియల్ గా డేట్ లాక్ చేసుకుని కొన్ని వారాల క్రితమే పోస్టర్ వదిలింది.
గతంలో విజయ్ దేవరకొండ 12 కూడా ఇదే తేదీని అధికారికంగా ప్రకటించుకుంది. పవన్ వస్తున్నాడు కాబట్టి VD12 వాయిదా వేస్తారు. మరి విశ్వంభర ఏం చేస్తాడన్నది అసలు ట్విస్టు. ఇక్కడో ప్రీ ప్లాన్ ఉన్నట్టు అంతర్గత సమాచారం. ఒకవేళ మళ్ళీ ఏదైనా కారణాల వల్ల హరిహర వీరమల్లు కనక వెనుకడుగు వేస్తే ఆ స్లాట్ ని వెంటనే విశ్వంభర లాక్ చేసుకుంటాడు. అంటే తమ్ముడు స్థానంలో అన్నయ్య అన్న మాట. కానీ నిర్మాత ఏఎం రత్నం ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఇప్పటికే విపరీతమైన జాప్యం, వాయిదాలతో ఆర్థికంగానూ చాలా బరువును మోస్తున్నారు. ఇది అర్థం చేసుకునే పవన్ కళ్యాణ్ ఓజిని కాదని వీరమల్లుకి డేట్లు ఇచ్చారు. సో విశ్వంభర ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి రావొచ్చు. అదే జరిగిన పక్షం ఏప్రిల్ లేదా జూన్ ఈ రెండు నెలల్లో ఒక మంచి టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు చెప్పేదాకా ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.
This post was last modified on October 11, 2024 12:00 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…