Movie News

తెలుగు చిత్రసీమకు సరిలేరు వేరెవ్వరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించింది. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో బాధితులు మిగిలారు. ఈ విపత్కాల సమయంలో ప్రభుత్వాలు చక్కని చర్యలు తీసుకుంటూ ఉండగా ఇంకోవైపు టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు దాతృత్వంలో తమకు ఎవరూ సాటిరారని ఋజువు చేసుకుంటున్నారు. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైతం మనవాళ్ళు ధారాళంగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంత జరుగుతున్నా తమిళ, మలయాళ హీరోల నుంచి కనీస స్పందన సానుభూతి రూపంలో రాకపోవడం గమనార్హం.

ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్లలో పవన్ కళ్యాణ్ (6 కోట్లు), ప్రభాస్ (2 కోట్లు), చిరంజీవి (1 కోటి), బాలకృష్ణ (1 కోటి), నాగార్జున (1 కోటి), మహేష్ బాబు (1 కోటి), జూనియర్ ఎన్టీఆర్ (1 కోటి), అల్లు అర్జున్ (1 కోటి), రామ్ చరణ్ (1 కోటి), ఫిలిం ఛాంబర్ (50 లక్షలు), హారికా హాసిని (50 లక్షలు), మైత్రి మేకర్స్ (50 లక్షలు), దిల్ రాజు సంస్థ (50 లక్షలు), వైజయంతి మూవీస్ (45 లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ (30 లక్షలు), సాయి ధరమ్ తేజ్ (25 లక్షలు), తెలుగు నిర్మాతల సమాఖ్య (20 లక్షలు), వరుణ్ తేజ్ (15 లక్షలు), తెలుగు ఫిలిం ఫెడరేషన్ (10 లక్షలు), విశ్వక్ సేన్ (10 లక్షలు), వెంకీ అట్లూరి (10 లక్షలు), అంబికా కృష్ణ (10 లక్షలు), అలీ (6 లక్షలు), అనన్య నాగళ్ళ (5 లక్షలు) ఉన్నారు.

ఇంకా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. అయితే ముంబై, చెన్నై, బెంగళూరు, కోచి నుంచి వచ్చి ఇక్కడ స్టార్ డం తెచ్చుకున్న కొందరు హీరోలు హీరోయిన్లు ఇంకా స్పందించనే లేదు. ఇచ్చే తీరాలన్న రూల్ లేదు కానీ ఇలాంటి సమయంలో అభిమానులు వాటిని కనీస స్థాయిలో ఆశించడం సహజం. ప్యాన్ ఇండియా ప్రమోషన్ల పేరుతో హైదరాబాద్ లో పదుల కొద్దీ ఈవెంట్లు చేసే కోలీవుడ్ హీరోల జాడే లేదు. మనం మాత్రం చెన్నై మునిగినా త్రివేండ్రం వరదలో తేలినా డబ్బులు ఇచ్చేస్తాం. అందుకే అనేది తెలుగు చిత్ర సీమకు సాటి వచ్చేవారు లేరు కనిపించరు.

This post was last modified on September 6, 2024 12:21 pm

Share
Show comments

Recent Posts

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

39 minutes ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

1 hour ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

4 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

5 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

8 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

10 hours ago