నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ఎక్స్ హ్యాండిల్ లో సింబాను పరిచయం చేస్తున్న సింహం కార్టూన్ ని పోస్ట్ చేయడం ద్వారా దీని గురించిన హింట్ స్పష్టంగా ఇచ్చాడు. షూటింగ్ ప్రారంభోత్సవం ఉండకపోవచ్చు కానీ అనౌన్స్ మెంట్ తో పాటు ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఎక్కువ వివరాలు బయటికి రానివ్వడం లేదు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీకి బడ్జెట్ కూడా ఊహకందని విధంగా ఉండబోతోంది.
ఇది కాసేపు పక్కనపెడితే ప్రశాంత్ వర్మ డిజైన్ చేసుకున్న సినిమాటిక్ యునివర్స్ కి మోక్షజ్ఞ అతి పెద్ద ప్రమోషన్ కాబోతున్నాడు. జాంబీ రెడ్డి, హనుమాన్ విజయాలు సాధించినప్పటికీ వాటి హీరో తేజ సజ్జ చిన్నవాడు. బలమైన బ్యాక్ గ్రౌండ్, అభిమానుల మద్దతు లేదు. కానీ మోక్షజ్ఞ కేసు అలా కాదు. బాలయ్య, తండ్రి ఎన్టీఆర్ అభిమానులందరూ ఎమోషనల్ గా తనతో కనెక్ట్ అవుతారు. గంపెడాశలతో మూడో తరంలో నందమూరి బ్రాండ్ ని మరింత పైకి తీసుకెళ్తాడనే నమ్మకంతో ఉన్నారు. నమ్మశక్యం కాని విధంగా మోక్షజ్ఞ కేవలం ఏడాదిన్నరలో చేసుకున్న మెకోవర్ అందరికీ ఆశ్చర్యపరిచింది.
దీనికి గాండీవ అనే టైటిల్ అనుకున్నట్టు లీక్ వచ్చింది ఇంకా నిర్ధారణగా తెలియదు. గతంలో బాలకృష్ణ హీరోగా 1993లో గాండీవం వచ్చింది కానీ ఆడలేదు. ఇటీవలే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున చూశాం. ఇదీ డిజాస్టరే. కేవలం టైటిల్ ని బట్టి సినిమాల ఫలితాలు తేలవు కానీ ప్రశాంత్ వర్మ ఎలాంటి ప్లాన్ తో ఉన్నదో ఇంకో మూడు రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం దీని మీదే పూర్తి ఫోకస్ పెడుతున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ని తర్వాత టేకప్ చేయబోతున్నాడు. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు రిలీజనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. స్కేల్ ని బట్టి చూస్తే 2026 అయ్యేలా ఉంది.
This post was last modified on September 3, 2024 5:58 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…