వెటరన్ దర్శకుల్లో కంబ్యాక్ కావాలని అభిమానులు కోరుకుంటున్న వాళ్ళలో శ్రీను వైట్ల పేరు ముందుంది. ఒకప్పడు దూకుడు, వెంకీ, ఆనందం లాంటి బ్లాక్ బస్టర్స్ తో రికార్డులు బద్దలు కొట్టిన ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. మహేష్ బాబు ఆగడు నుంచి మొదలైన డౌన్ ఫాల్ అమర్ అక్బర్ ఆంటోనీ వరకు కొనసాగింది. కానీ ఈసారి లెక్క మారేలా కనిపిస్తోంది. గోపిచంద్ హీరోగా రూపొందుతున్న విశ్వం వచ్చే నెల అక్టోబర్ 11 విడుదల కానుంది. రెండు నిమిషాల టీజర్ లో వినోదాన్ని ఎక్కువగా జొప్పించి శీను వైట్ల ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ట్రెండ్ ఫాలో అవుతూ పెట్టిన జోకులు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మా టైం వచ్చినప్పుడు కొడతాం, నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మార్షల్ ఆర్ట్స్ తెలియదు లాంటి డైలాగులు హిలేరియస్ గా ఉన్నాయి. నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వెంకీ స్టైల్ లో డిజైన్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ అంచనాలు రేపెలా ఉన్నాయి. యాక్షన్ టచ్ ఉంది కానీ ఆ కథకు సంబంధించిన కీలకమైన క్లూస్ ఇందులో ఇవ్వలేదు. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తో షాక్ తిన్న హీరోయిన్ కావ్య థాపర్ కు సైతం దీని సక్సెస్ చాలా కీలకం.
గోపీచంద్ కు బలమైన బ్లాక్ బస్టర్ పడి ఏళ్ళు గడిచిపోయాయి. ఫ్యాన్స్ తగ్గలేదు కానీ తన స్టామినాని సరిగా వాడుకునే కాంబోలు, దర్శకులు పడటం లేదు. విశ్వం ఆ లోటు తీరిస్తే సరి. రజనీకాంత్ వెట్టయన్ తప్ప దసరా బరిలో పెద్దగా చెప్పుకునే సినిమాలేవీ లేకపోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దొరికిన గ్యాప్ ని కనక విశ్వం వాడుకుంటే హిట్టు ఖాతాలో వేసుకోవచ్చు. ముందు ప్రకటించిన ప్రకారం ఆ టైంలో రావాల్సిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27కి షిఫ్ట్ అయిపోవడంతో పండగ స్లాట్ ఖాళీ అయ్యింది. ఎవరు వాడుకుంటారా అని చూస్తే విశ్వం తెలివిగా మంచి డేట్ పట్టేశాడు.
This post was last modified on September 3, 2024 6:09 pm
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…