ఇంకో నలభై ఎనిమిది గంటల లోపే విడుదల కాబోతున్న విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంకి ఉత్తరాది కార్పొరేట్ మల్టీప్లెక్సులు షాక్ ఇచ్చాయి. బాలీవుడ్ నిర్మాతలతో వీటి సమాఖ్య చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్, ఓటిటికి మధ్య గ్యాప్ ఖచ్చితంగా రెండు నెలలు అంటే ఎనిమిది వారాలు ఉండాల్సిందే. ఒకవేళ దీనికి కట్టుబడి ఉండకపోతే స్క్రీన్లు ఇవ్వమని ఖరాఖండిగా ముందే చెప్పేస్తారు. అయితే గోట్ కు పెట్టుకున్న విండో కేవలం 28 రోజులట. జీ ఫైవ్ తో అగ్రిమెంట్ జరిగింది. అలాంటప్పుడు తమ సముదాయాల్లో ప్రదర్శించడం కుదరదని తేల్చి చెప్పడంతో అక్కడ పరిమిత స్క్రీన్లలో రిలీజవుతోంది.
లియోకి సైతం ఇదే తరహా ట్రీట్ మెంట్ దక్కింది. ఇటీవలే రాయన్, తంగలాన్ లకు సైతం పివిఆర్ ఐనాక్స్ స్క్రీన్లు ఇవ్వలేదు. అక్కడి మార్కెట్ ని మరీ సీరియస్ గా తీసుకోకపోవడంతో నిర్మాతలు పట్టించుకోలేదు. గతంలో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, హనుమాన్ లాంటివి లేట్ స్ట్రీమింగ్ వల్ల అధిక సంఖ్యలో స్క్రీన్లను దక్కించుకోగలిగాయి. కానీ ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి అలా సాధ్యపడటం లేదు. ఎందుకంటే విజయ్ కు ఎంత ఇమేజ్ ఉన్నా డిజిటల్ వెర్షన్ కోసం రెండు నెలలు వెయిటింగ్ అంటే దాని మీదున్న క్రేజ్ చల్లారిపోతుంది. పైగా పైరసీ బెడద ఎక్కువ కాకుండా ప్రేక్షకులను అంతసేపు వెయిట్ చేయించడం కష్టం.
ఎలాగూ గోట్ తమిళ వెర్షన్ తప్ప మిగిలిన చోట ఏమంత హైప్ లేదు. మొదటి ఆట అయ్యాక ఒక్కసారిగా టాక్ జనాన్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తుందని టీమ్ చెబుతోంది కానీ అదెంత వరకు నిజమో అయిదో తేదీ ఉదయం బెనిఫిట్ షోతో తేలిపోతుంది. తెలుగులో మైత్రి పంపిణి చేస్తుండటంతో మంచి రిలీజ్ దక్కుతోంది. నాగ చైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభుకి దొరికిన గోల్డెన్ ఛాన్స్ ఇది. ప్రూవ్ చేసుకున్నారా స్టార్ హీరోలు తిరిగి పిలుస్తారు. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేసిన చివరి సినిమాల్లో ఒకటిగా గోట్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు అంతాఇంతా కాదు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…