కేరళలో హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మల్లువుడ్ లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో చూస్తున్నాం. అమ్మ సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా దాకా పరిస్థితి వెళ్లిందంటే వ్యవహారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఆర్టిస్టులతో మొదలు సీనియర్ నటీమణుల దాకా ఇప్పటిదాకా బయటికి చెప్పని ఆరోపణలతో మీడియాకు వెళ్లడం తీవ్ర సంచలనం రేపుతోంది. మంజు వారియర్ లాంటి వాళ్ళు ధైర్యంగా ఈ మార్పును స్వాగతించడంతో ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. నిజానికి లైంగిక వేధింపులు కేవలం మలయాళంలోనో సినిమా రంగంలోనో ఉన్నవి కాదు. అన్ని పరిశ్రమల్లో నివురు గప్పిన నిప్పులే.
ఇప్పుడిది టాలీవుడ్ వైపు మళ్లుతోందా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సమంత తెలంగాణ ప్రభుత్వనికి విన్నపం చేస్తూ 2019లో టిఎఫ్ఐలో ఏర్పడిన ది వాయిస్ అఫ్ విమెన్ ఇచ్చిన సబ్ కమిటీ రిపోర్ట్ వెల్లడి చేయాలని చెప్పడం క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. మంచు లక్ష్మి, నందిని రెడ్డి, సుమ కనకాల తదితరులు సామ్ కు మద్దతు తెలుపుతూ తమ సోషల్ మీడియా ద్వారా ఆమె సందేశాన్ని పంచుకున్నారు. ఇలా ఒక్కొక్కరుగా తోడవ్వడంతో సర్కారు స్పందిస్తుందా లేదా అనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి. గతంలో రేగిన క్యాస్టింగ్ కౌచ్ వివాదాలను మర్చిపోకూడదు.
ఒకవేళ నిజంగానే సామ్ కోరినట్టు ఏదైనా కదలిక వస్తే మాత్రం పెద్ద తేనె తుట్టెని కదిపినట్టేనని విశ్లేషకుల అంచనా. ఖడ్గం సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ హీరోయిన్ సంగీత పాత్ర ద్వారా చూపించినట్టు టాలీవుడ్ లోనూ లాంగిక వేధింపులు లేకపోలేదు. కానీ బయట పడిన ఉదంతాలు చాలా అంటే చాలా తక్కువ. ఒకరిద్దరు చెప్పేందుకు ప్రయత్నించినా వాళ్ళు పేరు లేని బాపతు కావడం వల్ల ప్రాముఖ్యం పొందలేదు. ఇప్పుడు స్వయంగా సమంతనే మహిళల రక్షణ కోసం నడుం బిగించాలని తెలంగాణ సర్కారుని కోరడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.
This post was last modified on September 1, 2024 10:33 am
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…