సత్యరాజ్, రమ్యకృష్ణ, నివేత పేతురాజ్, రెజీనా కసెండ్రా, జయరాం, శ్యామ్, నాజర్ ఇలా ఇంత పెద్ద సీనియర్ అండ్ జూనియర్ క్రేజీ క్యాస్టింగ్ తో ఒక సినిమా తీసినప్పుడు దానికి ఖచ్చితంగా క్రేజ్ వస్తుంది.
పైగా గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వెంకట్ ప్రభు దర్శకుడైతే ఇక చెప్పేముంది. కానీ షూటింగ్ పూర్తయినా ఏడేళ్లుగా సదరు మూవీ ల్యాబ్ లోనే మగ్గుతోందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దాని పేరు పార్టీ. 2017లో మొదలుపెట్టి రెండేళ్లలోనే గుమ్మడికాయ కొట్టారు. కానీ అదిగో ఇదిగో అంటూ నానబెడుతూ చివరికి ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ కు సిద్ధం చేయడం విశేషం.
దీని వెనుకో ఆసక్తికరమైన కథ ఉంది. పార్టీని ఫిజి ద్వీపంలో చిత్రీకరించారు. అప్పట్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే అక్కడ కనుక షూటింగ్ చేస్తే 47 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఆఫర్ బాగుందని మొత్తం అక్కడే తీశారు.
కట్ చేస్తే కరోనా వచ్చి ఫిజిలో పరిస్థితులు తలకిందులయ్యాయి. టూరిజం పడిపోయింది. దీంతో ఆ నలభై ఏడు మినహాయింపుని ఎత్తేశారు. అగ్రిమెంట్ లో రిలీజ్ చేయక ముందే రాయితీ పొందాలనే నిబంధన పొందుపరచడంతో పార్టీని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఫిజి సర్కారు సానుకూలంగా మారడంతో పార్టీ పనులు వేగవంతం చేశారు.
వెంకట్ ప్రభు విజయ్ తో తీసిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మీదున్న క్రేజ్ ఖచ్చితంగా పార్టీకి ఉపయోగడుతుందని భావిస్తున్న నిర్మాతలు సినిమాని డిసెంబర్ లోగా థియేటర్లకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంచి టెక్నీషియన్లతో పాటు భారీ క్యాస్టింగ్ నటించిన పార్టీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ తీసుకొస్తున్నారు. అన్నట్టు ఆ నలభై ఏడు శాతం డిస్కౌంట్ సంగతేమో కానీ ఇన్ని సంవత్సరాలు పెట్టుబడి మీద వడ్డీల భారం మోసుకుంటూ వచ్చిన ప్రొడ్యూసర్ కి ఈ ప్రాజెక్టు ఏం మిగిలిస్తుందో చూడాలి.కొన్ని సినిమాల తెరవెనుక కథలు ఇంతే. కామెడీలో ట్రాజెడీలాగా.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…