గత కొన్ని రోజులుగా మెగా అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేసిన ‘ఇంద్ర’ మూవీ ఎంతగా సందడి చేసిందో తెలిసిందే. కొత్త సినిమాలకు దీటుగా.. ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాలను మించి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టింది. చిరంజీవి సైతం ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, అభిమానుల హంగామా చూసి ఎగ్జైట్ అయ్యారు.
స్వయంగా వీడియో బైట్ ఇవ్వడమే కాక.. రిలీజ్ తర్వాత ‘ఇంద్ర’ టీంనంతా పిలిచి సన్మానం చేశాడు. ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ కూడా చాలా బాగా జరిగింది. విదేశాల్లో రీ రిలీజ్ చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలవడమే కాక.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ఇంద్ర’ హౌస్ ఫుల్స్తో రన్ అయింది. వారం తర్వాత కూడా ‘ఇంద్ర’ ఇంకా ఆడుతుండడం విశేషం.
ఐతే ‘ఇంద్ర’ రీ రిలీజ్ రన్ ముగింపు దశకు వస్తున్న సమయంలోనే మెగా అభిమాలకు ఇంకో పండుగ వచ్చింది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలోనూ రీ రిలీజ్ చేశారు. కానీ ఈసారి హంగామా వేరే లెవెల్లో ఉంది.
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక జరుగుతున్న తొలి పుట్టిన రోజు కావడంతో రీ రిలీజ్ ప్లానింగ్ గట్టిగా చేస్తున్నారు. షోలు పెరిగాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. పెట్టిన షోలు పెట్టినట్లు అయిపోతుండడంతో షోలు ముందు అనుకున్న దాని కంటే పెరుగుతున్నాయి. సెప్టెంబరు 1న రాత్రి నుంచే స్పెషల్ షోల హంగామా మొదలు కానుంది. ప్రతి థియేటర్ దగ్గరా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి సంబరాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని పవన్ ఫ్యాన్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
This post was last modified on August 28, 2024 7:53 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…