టాలీవుడ్లో నిలకడగా హిట్లు కొడుతూ, రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో.. నేచురల్ స్టార్ నాని. గత ఏడాది దసరా లాంటి మాస్ మూవీతోనే కాక హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీతోనూ అతను సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే మాస్, క్లాస్ మిక్స్ అయిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రమిది. అలాగే హైప్ పరంగా కూడా నాని కెరీర్లో ఇది టాప్లో నిలుస్తుందని చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సిటీలో, టౌన్లో ఒక పెద్ద హీరో సినిమా రేంజిలో ఇది రిలీజవుతోంది. హైదరాబాద్ సిటీలో వందల షోలు ఇచ్చారు ‘సరిపోదా శనివారం’ చిత్రానికి. ప్రతి మల్టీప్లెక్స్లోనూ మినిమం ఐదు షోలు పడుతున్నాయి. పెద్ద మల్టీప్లెక్సుల్లో అయితే 10 ప్లస్ షోలు వేస్తున్నారు. వాటికి స్పందన కూడా చాలా బాగుంది. బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే.. మల్టీప్లెక్సుల్లో ప్రతి షో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉంది. కొన్ని షోలు సోల్డ్ ఔట్ దశలో ఉన్నాయి.
నానికి ముందు నుంచి క్లాస్ హీరోగా మంచి పేరుంది. తన సినిమాలు మల్టీప్లెక్సుల్లో బాగా ఆడతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అక్కడ బాగా జరుగుతాయి. సింగిల్ స్క్రీన్లలో మిడ్ రేంజ్ సినిమాలకు ఆశించిన స్పందన ఉండదు. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కూడా సింగిల్ స్క్రీన్లలో బుకింగ్స్ ఓ మోస్తరుగా కనిపిస్తున్నాయంతే. కానీ మల్టీప్లెక్సుల్లో మాత్రం తొలి రోజు ప్రతి షో ఫుల్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ‘సరిపోదా శనివారం’లో మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపిస్తోంది.
నాని కెరీర్లోనే ఎన్నడూ చూడనంత హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. కాబట్టి రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే సింగిల్ స్క్రీన్లు కూడా కళకళలాడే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు రూ.30 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి బజ్ కనిపిస్తోంది.
This post was last modified on August 27, 2024 10:50 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…