టాలీవుడ్లో నిలకడగా హిట్లు కొడుతూ, రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో.. నేచురల్ స్టార్ నాని. గత ఏడాది దసరా లాంటి మాస్ మూవీతోనే కాక హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీతోనూ అతను సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే మాస్, క్లాస్ మిక్స్ అయిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రమిది. అలాగే హైప్ పరంగా కూడా నాని కెరీర్లో ఇది టాప్లో నిలుస్తుందని చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సిటీలో, టౌన్లో ఒక పెద్ద హీరో సినిమా రేంజిలో ఇది రిలీజవుతోంది. హైదరాబాద్ సిటీలో వందల షోలు ఇచ్చారు ‘సరిపోదా శనివారం’ చిత్రానికి. ప్రతి మల్టీప్లెక్స్లోనూ మినిమం ఐదు షోలు పడుతున్నాయి. పెద్ద మల్టీప్లెక్సుల్లో అయితే 10 ప్లస్ షోలు వేస్తున్నారు. వాటికి స్పందన కూడా చాలా బాగుంది. బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే.. మల్టీప్లెక్సుల్లో ప్రతి షో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉంది. కొన్ని షోలు సోల్డ్ ఔట్ దశలో ఉన్నాయి.
నానికి ముందు నుంచి క్లాస్ హీరోగా మంచి పేరుంది. తన సినిమాలు మల్టీప్లెక్సుల్లో బాగా ఆడతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అక్కడ బాగా జరుగుతాయి. సింగిల్ స్క్రీన్లలో మిడ్ రేంజ్ సినిమాలకు ఆశించిన స్పందన ఉండదు. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కూడా సింగిల్ స్క్రీన్లలో బుకింగ్స్ ఓ మోస్తరుగా కనిపిస్తున్నాయంతే. కానీ మల్టీప్లెక్సుల్లో మాత్రం తొలి రోజు ప్రతి షో ఫుల్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ‘సరిపోదా శనివారం’లో మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపిస్తోంది.
నాని కెరీర్లోనే ఎన్నడూ చూడనంత హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. కాబట్టి రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే సింగిల్ స్క్రీన్లు కూడా కళకళలాడే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు రూ.30 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి బజ్ కనిపిస్తోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…