న్యాచురల్ స్టార్ నాని అభిమానులు సందర్భం వచ్చిన ప్రతిసారి అంటే సుందరానికి ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఆడాల్సిందని, ప్రేక్షకులకు అర్థం కావడంలో ఎక్కడో పొరపాటు జరిగిందని భావిస్తారు. అయితే నానికి కూడా ఈ మూవీ ప్రత్యేకం. చాలా ఇష్టపడి ప్రేమించి చేశాడు. రిలీజైన టైంలో గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ డిజాస్టర్ కాకపోయినా హిట్టని చెప్పుకోలేని విధంగానే రిజల్ట్ వచ్చింది. తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగం దీనికి సంబంధించిన ప్రశ్న నానికి ఎదురయ్యింది.
దానికి సమాధానం చెబుతూ ప్రేక్షకులు తమ నుంచి ఎంటర్ టైనర్ ఆశించారని, కానీ దాని స్థానంలో స్లోగా నడిచే ఎమోషనల్ లవ్ డ్రామా ఇవ్వడం వల్ల అంచనాలు అందుకోలేకపోయిందని వివరించాడు. ఈసారి పొరపాటు జరగకుండా అదే దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఈసారి ఎలాంటి కొలతలు తగ్గకుండా సరిపోదా శనివారంని రూపొందించామని హామీ ఇచ్చాడు. టక్ జగదీశ్, అంటే సుందరానికి మిక్స్డ్, నెగటివ్ రివ్యూలు వచ్చినప్పుడు ఆ ఇద్దరి దర్శకులను తన చోటికి పిలిచి మోటివేట్ చేశానని, ఇది తన కనీస బాధ్యతని నాని చెప్పడం అతనెంత స్పెషలో చెప్పకనే చెబుతుంది
ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఎప్పుడూ లేనిది వివేక్ ఆత్రేయ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఎస్జె సూర్య విలన్ కావడంతో తమిళనాడులో కూడా అదనంగా మార్కెట్ దక్కనుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా పెద్ద క్యాస్టింగే ఉంది. కథ మొత్తం ముందే చెప్పేసి రాజమౌళి తరహాలో ఆడియన్స్ ని సిద్ధం చేస్తున్న శనివారం టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పోటీ కూడా లేకపోవడంతో టాక్ రావడం ఆలస్యం హిందీతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో సులభంగా దూసుకుపోవచ్చు.
This post was last modified on August 20, 2024 3:31 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…