న్యాచురల్ స్టార్ నాని అభిమానులు సందర్భం వచ్చిన ప్రతిసారి అంటే సుందరానికి ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఆడాల్సిందని, ప్రేక్షకులకు అర్థం కావడంలో ఎక్కడో పొరపాటు జరిగిందని భావిస్తారు. అయితే నానికి కూడా ఈ మూవీ ప్రత్యేకం. చాలా ఇష్టపడి ప్రేమించి చేశాడు. రిలీజైన టైంలో గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ డిజాస్టర్ కాకపోయినా హిట్టని చెప్పుకోలేని విధంగానే రిజల్ట్ వచ్చింది. తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగం దీనికి సంబంధించిన ప్రశ్న నానికి ఎదురయ్యింది.
దానికి సమాధానం చెబుతూ ప్రేక్షకులు తమ నుంచి ఎంటర్ టైనర్ ఆశించారని, కానీ దాని స్థానంలో స్లోగా నడిచే ఎమోషనల్ లవ్ డ్రామా ఇవ్వడం వల్ల అంచనాలు అందుకోలేకపోయిందని వివరించాడు. ఈసారి పొరపాటు జరగకుండా అదే దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఈసారి ఎలాంటి కొలతలు తగ్గకుండా సరిపోదా శనివారంని రూపొందించామని హామీ ఇచ్చాడు. టక్ జగదీశ్, అంటే సుందరానికి మిక్స్డ్, నెగటివ్ రివ్యూలు వచ్చినప్పుడు ఆ ఇద్దరి దర్శకులను తన చోటికి పిలిచి మోటివేట్ చేశానని, ఇది తన కనీస బాధ్యతని నాని చెప్పడం అతనెంత స్పెషలో చెప్పకనే చెబుతుంది
ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఎప్పుడూ లేనిది వివేక్ ఆత్రేయ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఎస్జె సూర్య విలన్ కావడంతో తమిళనాడులో కూడా అదనంగా మార్కెట్ దక్కనుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా పెద్ద క్యాస్టింగే ఉంది. కథ మొత్తం ముందే చెప్పేసి రాజమౌళి తరహాలో ఆడియన్స్ ని సిద్ధం చేస్తున్న శనివారం టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పోటీ కూడా లేకపోవడంతో టాక్ రావడం ఆలస్యం హిందీతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో సులభంగా దూసుకుపోవచ్చు.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…