భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటనదగ్గ చిత్రం.. ఇండియన్. కమల్ హాసన్ హీరోగా శంకర్ రూపొందించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సమయానికి సౌత్ ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. తెలుగులో భారతీయుడు, హిందీలో హిందుస్థాని పేరుతో అనువాదమై రెండు చోట్లా విజయవంతమైంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
ఐతే ‘ఇండియన్’ సినిమా చూశాక కమల్ తప్ప సేనాపతి పాత్రకు ఇంకెవ్వరూ న్యాయం చేయలేరని అనిపిస్తుంది. కొడుకు పాత్రలోనూ ఆయన అంత కన్విన్సింగ్గా నటించి మెప్పించారు. కానీ నిజానికి ఈ సినిమాలో కమల్ నటించాల్సిందే కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ను దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ కథ రాశాడు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కమల్ను సంప్రదించారు. ఆయన ఓకే అనడంతో సినిమా పట్టాలెక్కింది.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. కమల్ కూడా ఒప్పుకోకుంటే శంకర్ దృష్టిలో ఇంకో రెండు ఆప్షన్లు ఉన్నాయట. తెలుగు స్టార్లయిన రాజశేఖర్, వెంకటేష్లతో ఈ సినిమా తీయాలని శంకర్ అనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి శంకర్ అసిస్టెంట్, తర్వాతి కాలంలో దర్శకుడిగా మారిన వసంత బాలన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కమల్ కూడా ఒప్పుకోని పక్షంలో రాజశేఖర్తో సేనాపతి పాత్ర చేయించి.. కొడుకు పాత్రను వెంకటేష్కు ఇవ్వాలని శంకర్ భావించాడట.
ఐతే కమల్కు ‘ఇండియన్’ కథ తెగ నచ్చేసి తండ్రీకొడుకులిద్దరి పాత్రలు తనే చేయడానికి ముందుకొచ్చాడు. ముఖ్యంగా సేనాపతి పాత్ర కోసం ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. దాన్ని అత్యద్భుతంగా పోషించడంతో ఆ పాత్ర జనాలకు విపరీతంగా నచ్చేసింది. సినిమా తిరుగులేని బ్లాక్బస్టర్ అయింది. ఇప్పుడు ఆలోచిస్తే రాజశేఖర్, వెంకటేష్ సేనాపతి-చందు పాత్రలకు న్యాయం చేయగలిగేవారా అన్న సందేహం కలుగుతుంది.
This post was last modified on July 9, 2024 6:59 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…