నిన్న వెలువడిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి అమోఘ విజయం గురించి మీడియాలో, ప్రజల్లో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఊహించిన దానికన్నా చాలా గొప్పగా, ఎగ్జిట్ పోల్స్ కు సైతం అందనంత ఎత్తుగా వచ్చిన మార్పు చూసి జనమే ఆశ్చర్యపోతున్నారు. జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి విషెస్ రాలేదనే అంశాన్ని క్రమంగా కొన్ని వర్గాలు వాడుకోవాలని చూశాయి.
వాటికి చెక్ పెడుతూ తారక్ ఎక్స్ వేదికగా మావయ్య చంద్రబాబునాయుడు, బాబాయ్ బాలకృష్ణ, అత్త పురందరేశ్వరి, లోకేష్. మతుకుమిల్లి భరత్ లకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టడంతో ఊహాగానాలకు బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ కి కొనసాగింపు ట్వీట్ లో ప్రత్యేకంగా విష్ చేయడం గమనార్హం. నిజానికి టీడీపీ ప్రచార పర్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఏనాడూ పాల్గొనలేదు. రాజకీయంగా టీడీపీకి అవమానాలు ఎదురైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి వివాదాలకు దూరంగా ఉన్నాడు. దీని గురించి విమర్శలు వచ్చినా సరే తనతో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒకే మాట మీద కొనసాగారు.
ఇప్పుడు విజయాల్లో భాగం పంచుకోవడం బాధ్యత కాబట్టి తనవైపు నుంచి జూనియర్ మనసులో మాటలు పంచుకున్నాడు. అబ్బాయి బాబాయ్ కి ఏదో వైరం ఉందని, తెలుగుదేశం కావాలని తారక్ ని దూరం పెట్టిందనే ప్రచారాలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల గురించి ఇప్పట్లో ఆలోచన చేసే ప్రసక్తే లేదని తన సన్నహితులతో చెబుతూ వచ్చాడు. కాకపోతే చంద్రబాబు అరెస్ట్ జరిగిన సమయంగా తీవ్రంగా ఖండించలేదనే అసంతృప్తి ఒక్కటే టిడిపి వర్గాల్లో ఉండింది. ఇప్పుడంతా ఆల్ ఈజ్ వెల్ అనే చెప్పొచ్చు.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…