బాలీవుడ్ నటుడే అయినప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ హ్యాపీ, సుమంత్ ప్రేమకథ, క్రిష్ వేదం, పవన్ కళ్యాణ్ కొమరం పులి లాంటి వాటితో మనకూ సుపరిచితుడే. ముఖ్యంగా తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే తీసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మరింత చేరువయ్యాడు. గత ఏడాది సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో స్వామిజి బారిన పడి అత్యాచారానికి గురైన అమ్మాయి తరఫున వాదించే లాయర్ గా మనోజ్ బాయ్ పాయ్ అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇటీవలే ఈ సినిమా దర్శకుడు అపూర్వ్ సింగ్ తో మనోజ్ బాజ్ పాయ్ భయ్యాజీ అనే సినిమా చేశాడు. గత శుక్రవారం రిలీజై బిసి సెంటర్లలో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతోంది. ఏ కేంద్రాల్లో తుస్సుమంది. నిజానికి ఈ కాంబో మూవీ అనగానే ఆడియన్స్ లో మంచి అంచనాలు తలెత్తాయి. దానికి తోడు ట్రైలర్ హైప్ ని పెంచింది. కానీ దానికి తగ్గట్టు కంటెంట్ లేకపోవడం నిరాశ కలిగించింది. ఢిల్లీలో చదువుకునే రామ్ చరణ్ (మనోజ్ బాజ్ పాయ్) తమ్ముడిని విలన్ కొడుకు యాక్సిడెంట్ లో చంపేస్తాడు. దీంతో ప్రతీకారం కోసం తన పాత వేషం భయ్యాజి బయటికి తీస్తాడు రామ్ చరణ్. ఆ తర్వాత చేసే శత్రు సంహారమే కథ.
ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్లతో మాస్ కి నచ్చేలా ఓ మోస్తరుగా లాగించినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అపూర్వ్ సింగ్ చేతులు ఎత్తేశాడు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన రాజశేఖర్ అన్ననే స్ఫూర్తిగా తీసుకుని దానికి బీహార్ రంగులు అద్ది ఏదో చేయబోయి చివరికి ఖంగాళీగా మార్చేశాడు. ఇంత బలహీనమైన టేకింగ్ లోనే మనోజ్ ఒక్కడే ఈ సినిమా చూసేందుకు ఒక కారణంగా నిలిచాడు. అయినా సిర్ఫ్ బందా లాంటి గొప్ప చిత్రాన్ని తీసిన హీరో డైరెక్టర్ కాంబో నుంచి ఇలాంటి భయ్యాను ఆశించలేదని చూసిన జనాలు ఉసూరుమంటున్నారు. ప్రతిసారి మేజిక్ జరగదుగా.
This post was last modified on May 30, 2024 11:50 pm
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…