బాలీవుడ్ నటుడే అయినప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ హ్యాపీ, సుమంత్ ప్రేమకథ, క్రిష్ వేదం, పవన్ కళ్యాణ్ కొమరం పులి లాంటి వాటితో మనకూ సుపరిచితుడే. ముఖ్యంగా తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే తీసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మరింత చేరువయ్యాడు. గత ఏడాది సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో స్వామిజి బారిన పడి అత్యాచారానికి గురైన అమ్మాయి తరఫున వాదించే లాయర్ గా మనోజ్ బాయ్ పాయ్ అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇటీవలే ఈ సినిమా దర్శకుడు అపూర్వ్ సింగ్ తో మనోజ్ బాజ్ పాయ్ భయ్యాజీ అనే సినిమా చేశాడు. గత శుక్రవారం రిలీజై బిసి సెంటర్లలో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతోంది. ఏ కేంద్రాల్లో తుస్సుమంది. నిజానికి ఈ కాంబో మూవీ అనగానే ఆడియన్స్ లో మంచి అంచనాలు తలెత్తాయి. దానికి తోడు ట్రైలర్ హైప్ ని పెంచింది. కానీ దానికి తగ్గట్టు కంటెంట్ లేకపోవడం నిరాశ కలిగించింది. ఢిల్లీలో చదువుకునే రామ్ చరణ్ (మనోజ్ బాజ్ పాయ్) తమ్ముడిని విలన్ కొడుకు యాక్సిడెంట్ లో చంపేస్తాడు. దీంతో ప్రతీకారం కోసం తన పాత వేషం భయ్యాజి బయటికి తీస్తాడు రామ్ చరణ్. ఆ తర్వాత చేసే శత్రు సంహారమే కథ.
ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్లతో మాస్ కి నచ్చేలా ఓ మోస్తరుగా లాగించినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అపూర్వ్ సింగ్ చేతులు ఎత్తేశాడు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన రాజశేఖర్ అన్ననే స్ఫూర్తిగా తీసుకుని దానికి బీహార్ రంగులు అద్ది ఏదో చేయబోయి చివరికి ఖంగాళీగా మార్చేశాడు. ఇంత బలహీనమైన టేకింగ్ లోనే మనోజ్ ఒక్కడే ఈ సినిమా చూసేందుకు ఒక కారణంగా నిలిచాడు. అయినా సిర్ఫ్ బందా లాంటి గొప్ప చిత్రాన్ని తీసిన హీరో డైరెక్టర్ కాంబో నుంచి ఇలాంటి భయ్యాను ఆశించలేదని చూసిన జనాలు ఉసూరుమంటున్నారు. ప్రతిసారి మేజిక్ జరగదుగా.
This post was last modified on May 30, 2024 11:50 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…