Political News

రాజుగారి నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు స్తంభాలాట‌!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది. ఇక్క‌డ పోలింగ్ ప‌ర్సంటేజీ బాగానే న‌మోదైంది. 86.20 పోలింగ్ న‌మోదైంది. కానీ, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాదిరిగా ఇక్క‌డ ద్విముఖ పోరు సాగ‌లేదు. ఇత‌ర నియోజ‌క‌వ ర్గాల‌ను తీసుకుంటే.. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి అభ్య‌ర్థుల మ‌ధ్య పోరు సాగింది. దీంతో ఎవ‌రు గెలు స్తార‌నేది స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పోనీ.. కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయ‌కులు పోటీ చేసినా.. పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. కానీ, ఎటొచ్చీ.. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా.. న‌లుగురు కీల‌క నాయ‌కులు పోటీ చేశారు. వీరిలో ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన వారు ముగ్గురు ఉండ‌గా.. ఒక‌రు ఇండిపెండెంటుగా బ‌రిలో నిలిచారు. ఈ ప‌రిణామంతో ఇక్క‌డ త్రిముఖ పోరు సాగింద‌ని స్ఫష్టంగా తెలుస్తోంది. వైసీపీ నుంచి పీవీఎల్ న‌ర‌సింహ రాజు బ‌రిలో ఉన్నారు.

ఇక‌, టీడీపీ నుంచి చివ‌రి నిముషంలో న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పోటీలో ఉన్నారు. దీంతో వీరి మ‌ధ్యే అస‌లు సిస‌లు పోటీ ఉంటుంద‌ని అంచ‌నా వేసుకున్నారు.  కానీ, చివ‌రి నిముషంలోఇక్క‌డ  వ్యూహం మారిపోయింది. త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌న్న ఆవేద‌న‌తో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివ‌రామ‌రాజు.. క‌లువ పూడి శివ ఇండిపెండెంటుగా రంగంలోకి దిగారు. స్థానికంగా మంచిపేరు, స్థిర‌, చిర ప‌రిచ‌యాలు ఉండ‌డం.. ఈయ‌న‌కు మేలు చేస్తున్నాయి.

వీటితోపాటు.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌న్న సానుభూతి, ఇప్పుడు టికెట్ ద‌క్క‌లేద‌న్న సానుభూతి కూడా .. క‌లువ‌పూడి శివ‌కు ప‌ని చేశాయ‌ని తెలుస్తోంది. ఇదేస‌మ‌యంలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు వ‌ర్గం.. క‌లువపూడి శివ‌వైపే  ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ర‌ఘురామ కూడా చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి భారీ పార్టీలు ఇచ్చారు. రాజుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు డ‌బ్బులు కూడా పంచారు. అయితే.. ఫ‌లితంపై మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌నే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.  

This post was last modified on May 30, 2024 11:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago