ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది. ఇక్కడ పోలింగ్ పర్సంటేజీ బాగానే నమోదైంది. 86.20 పోలింగ్ నమోదైంది. కానీ, ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ ద్విముఖ పోరు సాగలేదు. ఇతర నియోజకవ ర్గాలను తీసుకుంటే.. వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థుల మధ్య పోరు సాగింది. దీంతో ఎవరు గెలు స్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పోనీ.. కొన్నికొన్ని నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు పోటీ చేసినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఎటొచ్చీ.. ఉండి నియోజకవర్గంలో ఏకంగా.. నలుగురు కీలక నాయకులు పోటీ చేశారు. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. ఒకరు ఇండిపెండెంటుగా బరిలో నిలిచారు. ఈ పరిణామంతో ఇక్కడ త్రిముఖ పోరు సాగిందని స్ఫష్టంగా తెలుస్తోంది. వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహ రాజు బరిలో ఉన్నారు.
ఇక, టీడీపీ నుంచి చివరి నిముషంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీలో ఉన్నారు. దీంతో వీరి మధ్యే అసలు సిసలు పోటీ ఉంటుందని అంచనా వేసుకున్నారు. కానీ, చివరి నిముషంలోఇక్కడ వ్యూహం మారిపోయింది. తనకు టికెట్ దక్కలేదన్న ఆవేదనతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు.. కలువ పూడి శివ ఇండిపెండెంటుగా రంగంలోకి దిగారు. స్థానికంగా మంచిపేరు, స్థిర, చిర పరిచయాలు ఉండడం.. ఈయనకు మేలు చేస్తున్నాయి.
వీటితోపాటు.. గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి, ఇప్పుడు టికెట్ దక్కలేదన్న సానుభూతి కూడా .. కలువపూడి శివకు పని చేశాయని తెలుస్తోంది. ఇదేసమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గం.. కలువపూడి శివవైపే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. రఘురామ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి భారీ పార్టీలు ఇచ్చారు. రాజులను మచ్చిక చేసుకునేందుకు డబ్బులు కూడా పంచారు. అయితే.. ఫలితంపై మాత్రం తర్జన భర్జనే సాగుతుండడం గమనార్హం.
This post was last modified on May 30, 2024 11:46 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…