టాలెంట్ కి ఎలాంటి లోటు లేకపోయినా కష్టపడే తత్వంలో తన రేంజ్ హీరోల కంటే కొన్ని అడుగులు ముందున్న సుధీర్ బాబుకి సక్సెస్ విషయంలో అదృష్టం కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక మార్కెట్ బాగా డీలా పడింది. అందుకే ఆశలన్నీ హరోం హర మీదే పెట్టుకున్నాడు. మే 31 విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తీవ్రమైన పోటీ అతనికి పెద్ద సవాల్ గా మారే సూచనలు స్పష్టం. గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనూహ్యంగా మే 17 నుంచి వాయిదా పడి హరోం హర వచ్చే రోజునే ఎంచుకోవడంతో ఓపెనింగ్స్ పరంగా విశ్వక్ సేన్ కంటే సుధీర్ బాబుకే ఎక్కువ రిస్క్ కనిపిస్తున్న మాట వాస్తవం.
దీన్ని కాచుకోవడం అంత సులభంగా ఉండదు. ఎందుకంటే గ్యాంగ్స్ అఫ్ గోదావరి తెస్తున్నది సితార సంస్థ. దానికున్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వల్ల పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కుతాయి. హరోం హరకు బయ్యర్లు ఉన్నప్పటికీ పోలిక పరంగా చూసుకుంటే ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ విశ్వక్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంది. ఇది కాకుండా మ్యూజిక్ షాప్ మూర్తి, గంగం గణేశా, సత్యభామ, భజే వాయు వేగం కూడా అదే డేట్ మీద కన్నేశాయి. ఇదంతా ఒక ఎత్తయితే సరిగ్గా ఈ సినిమాలన్నీ రిలీజైన అయిదో రోజే జూన్ 4న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి.
ఈసారి రాజకీయం చాలా వేడిగా ఉన్న నేపథ్యంలో గెలిచే పార్టీ ఏదైనా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. సంబరాలతో పాటు గొడవలు జరిగే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇలాంటి వాతావరణంలో జనాలు అదే పనిగా థియేటర్లకు రావడం అనుమానమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పెద్దగా ఇబ్బందేం ఉండకపోవచ్చేమో కానీ యావరేజ్ అనిపించుకుంటే మాత్రం వసూళ్లకు కష్టపడాల్సి ఉంటుంది. సుధీర్ బాబు మాత్రం హరోంహర విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, హరోంహర రెండిట్లోనూ హీరోకి రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఉండటం కాకతాళీయమే అయినా గమనించాల్సిన విషయం.
This post was last modified on May 15, 2024 1:35 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…