ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎవరూ ఊహించని విధంగా జరిగింది. సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లోనూ రాత్రి 7 గంటల వరకు సాగింది. ఇది నిర్ణీత సమయం కన్నా 1గంట ఎక్కువ. ఇక, ఇతర 47 పోలింగ్ బూతుల్లో రాత్రి 10 గంటల వరకు, 34 చోట్ల రాత్రి 2 గంటల వరకు కూడా జరిగింది. దీంతో పోలింగ్ శాతం 70 అనుకున్నది కూడా.. ఏకంగా 81.60 శాతానికి చేరింది. ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ తరహా ఓట్లు రాలడం, రావడం అనేది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇంత భారీగా పెరిగిన ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా మారుతుందనేది చర్చనీయాంశం అయితే. దీనిపై వైసీపీ , టీడీపీ కూటమి పక్షాలు ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమని కూటమి పక్షాలు భావిస్తున్నాయి. అలాగని బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. గత ఐదేళ్లలో జగన్ చేసిన సంక్షేమం.. దీనికి అడుతగులుతోంది.
పోనీ… వైసీపీ చెబుతున్న మేరకు ప్రభుత్వ సానుకూలతే ఓటు రూపంలో రాలిందని అంటున్నారు. వారు కూడా.. దీనిని బలంగా ప్రొజెక్టు చేసుకోలేక పోతున్నారు. మొత్తంగా చూస్తే.. ఓటు బ్యాంకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. కూటమికి అనుకూలమనే చర్చ సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీకి ప్లస్ అని అంటున్నారు. అయితే.. ఎటు పడినా.. భారీ ఓటు బ్యాంకు కావడంతో ఎలాంటి పరిస్థితి వస్తుంది? అనేది ఆసక్తిగా మారింది.
ఒకవేళ.. ఎవరు గెలిచినా… పది సీట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని మరో అంచనాగా ఉంది. మొత్తానికి 1957తో పోల్చుకుంటే.. ఎన్నడూ లేని విధంగా ఓటరు చైతన్యం అయితే కనిపించింది. అమరావతి రాజదాని కోసం కావొచ్చు.. లేదా.. వైసీపీ ఇచ్చిన సంక్షేమం కావొచ్చు.. చంద్రబాబును జైలు పంపారన్న కసి కావొచ్చు.. ఇవన్నీ కాకుండా.. ఉద్యోగ, ఉపాధి అంశాలు కావొచ్చు.. ఎలా చూసుకున్నా.. ఫ్యాక్టర్ ఏదైనా.. ఓటరు నాడికోసం వేచి చూడాల్సిందే.
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…