ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎవరూ ఊహించని విధంగా జరిగింది. సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లోనూ రాత్రి 7 గంటల వరకు సాగింది. ఇది నిర్ణీత సమయం కన్నా 1గంట ఎక్కువ. ఇక, ఇతర 47 పోలింగ్ బూతుల్లో రాత్రి 10 గంటల వరకు, 34 చోట్ల రాత్రి 2 గంటల వరకు కూడా జరిగింది. దీంతో పోలింగ్ శాతం 70 అనుకున్నది కూడా.. ఏకంగా 81.60 శాతానికి చేరింది. ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ తరహా ఓట్లు రాలడం, రావడం అనేది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇంత భారీగా పెరిగిన ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా మారుతుందనేది చర్చనీయాంశం అయితే. దీనిపై వైసీపీ , టీడీపీ కూటమి పక్షాలు ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమని కూటమి పక్షాలు భావిస్తున్నాయి. అలాగని బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. గత ఐదేళ్లలో జగన్ చేసిన సంక్షేమం.. దీనికి అడుతగులుతోంది.
పోనీ… వైసీపీ చెబుతున్న మేరకు ప్రభుత్వ సానుకూలతే ఓటు రూపంలో రాలిందని అంటున్నారు. వారు కూడా.. దీనిని బలంగా ప్రొజెక్టు చేసుకోలేక పోతున్నారు. మొత్తంగా చూస్తే.. ఓటు బ్యాంకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. కూటమికి అనుకూలమనే చర్చ సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీకి ప్లస్ అని అంటున్నారు. అయితే.. ఎటు పడినా.. భారీ ఓటు బ్యాంకు కావడంతో ఎలాంటి పరిస్థితి వస్తుంది? అనేది ఆసక్తిగా మారింది.
ఒకవేళ.. ఎవరు గెలిచినా… పది సీట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని మరో అంచనాగా ఉంది. మొత్తానికి 1957తో పోల్చుకుంటే.. ఎన్నడూ లేని విధంగా ఓటరు చైతన్యం అయితే కనిపించింది. అమరావతి రాజదాని కోసం కావొచ్చు.. లేదా.. వైసీపీ ఇచ్చిన సంక్షేమం కావొచ్చు.. చంద్రబాబును జైలు పంపారన్న కసి కావొచ్చు.. ఇవన్నీ కాకుండా.. ఉద్యోగ, ఉపాధి అంశాలు కావొచ్చు.. ఎలా చూసుకున్నా.. ఫ్యాక్టర్ ఏదైనా.. ఓటరు నాడికోసం వేచి చూడాల్సిందే.
This post was last modified on May 15, 2024 3:17 pm
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో…
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…