దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 కొత్త విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యిందని సమాచారం. జూలై 12 సానుకూలంగా ఉంటుందని భావిస్తుండటంతో దాన్నే ఖాయం చేయొచ్చని చెన్నై టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ లైకా నిర్మాతలు, శంకర్ పరస్పరం చర్చించుకుని అంతా క్లియర్ అనుకున్నాకే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ముందు జూన్ 13 అనుకున్నా కానీ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. ఎన్నికల వేడి పూర్తిగా తగ్గాలనేది దాని వెనుక ఉన్న మరో స్ట్రాటజీ. ఇప్పుడిక ఎలాంటి అడ్డంకులు లేనట్టే.
ఇది రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. ఎందుకంటే భారతీయుడు 2 రిలీజ్ అయితే కానీ శంకర్ పూర్తి స్థాయిలో గేమ్ ఛేంజర్ కోసం టైం కేటాయించలేరు. పైగా చాలా వర్క్ బ్యాలన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, తమన్ రీ రికార్డింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ఎన్నో వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూట్ హైదరాబాద్ లో జరుగుతూనే ఉంది. జూలైలో దీన్నుంచి విముక్తి పొందాలనే టార్గెట్ తో చరణ్ ఎప్పుడు డేట్స్ కావాలన్నా అందుబాటులో ఉంటున్నాడు. దానికి అనుగుణంగానే చిత్రీకరణ జరుగుతోంది. అసలు సమస్య మరొకటి ఉంది.
నిర్మాత దిల్ రాజు ఇప్పటిదాకా రిలీజ్ ని ప్రకటించలేదు. భారతీయుడు 2 ఫిక్స్ అయితే తప్ప ఏం మాట్లాడలేనని శంకర్ ముందు నుంచి ఒకే మాట మీద ఉండటం వల్ల జాప్యం తప్పలేదు. అసలు గేమ్ ఛేంజర్ ఈ సంవత్సరమే వస్తుందా లేక వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం కష్టం అనేలా ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ సహనాన్ని పీక్స్ లో పరీక్షించిన నేపథ్యంలో ముందు భారతీయుడు 2 రిలీజ్ కావాలని వాళ్ళు కోరుకోవడం న్యాయముంది. బజ్ విషయంలో కమల్ మూవీ వెనుకబడి ఉండటంతో భారీ ఎత్తున ప్రమోషన్లకు ప్లానింగ్ జరుగుతోందట.
This post was last modified on May 15, 2024 12:13 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…