దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 కొత్త విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యిందని సమాచారం. జూలై 12 సానుకూలంగా ఉంటుందని భావిస్తుండటంతో దాన్నే ఖాయం చేయొచ్చని చెన్నై టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ లైకా నిర్మాతలు, శంకర్ పరస్పరం చర్చించుకుని అంతా క్లియర్ అనుకున్నాకే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ముందు జూన్ 13 అనుకున్నా కానీ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. ఎన్నికల వేడి పూర్తిగా తగ్గాలనేది దాని వెనుక ఉన్న మరో స్ట్రాటజీ. ఇప్పుడిక ఎలాంటి అడ్డంకులు లేనట్టే.
ఇది రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. ఎందుకంటే భారతీయుడు 2 రిలీజ్ అయితే కానీ శంకర్ పూర్తి స్థాయిలో గేమ్ ఛేంజర్ కోసం టైం కేటాయించలేరు. పైగా చాలా వర్క్ బ్యాలన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, తమన్ రీ రికార్డింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ఎన్నో వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూట్ హైదరాబాద్ లో జరుగుతూనే ఉంది. జూలైలో దీన్నుంచి విముక్తి పొందాలనే టార్గెట్ తో చరణ్ ఎప్పుడు డేట్స్ కావాలన్నా అందుబాటులో ఉంటున్నాడు. దానికి అనుగుణంగానే చిత్రీకరణ జరుగుతోంది. అసలు సమస్య మరొకటి ఉంది.
నిర్మాత దిల్ రాజు ఇప్పటిదాకా రిలీజ్ ని ప్రకటించలేదు. భారతీయుడు 2 ఫిక్స్ అయితే తప్ప ఏం మాట్లాడలేనని శంకర్ ముందు నుంచి ఒకే మాట మీద ఉండటం వల్ల జాప్యం తప్పలేదు. అసలు గేమ్ ఛేంజర్ ఈ సంవత్సరమే వస్తుందా లేక వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం కష్టం అనేలా ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ సహనాన్ని పీక్స్ లో పరీక్షించిన నేపథ్యంలో ముందు భారతీయుడు 2 రిలీజ్ కావాలని వాళ్ళు కోరుకోవడం న్యాయముంది. బజ్ విషయంలో కమల్ మూవీ వెనుకబడి ఉండటంతో భారీ ఎత్తున ప్రమోషన్లకు ప్లానింగ్ జరుగుతోందట.
This post was last modified on May 15, 2024 12:13 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…