ఆ మధ్య కొంత కాలం వరస ఫ్లాపులతో సతమతమైన శ్రీవిష్ణు తిరిగి గాడిన పడ్డాడు. సామజవరగమన ఊహించిన దానికన్నా చాలా పెద్ద సక్సెస్ కావడం మార్కెట్ పరంగా ఎంతో ఉపయోగపడింది. ఈ కారణంగానే ఓం భీం బుష్ మంచి బిజినెస్ చేసుకోగలిగింది. రెండూ కామెడీ ఎంటర్ టైనర్లు కావడం గమనించాల్సిన విషయం. రేంజ్ పరంగా ఒకటే ఫలితం అందుకోనప్పటికీ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు దోహదం చేశాయి. గతంలో రాజా రాజా చోర కూడా వినోదాత్మక జానర్ లోనే వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సీరియస్ బాట పట్టనున్నాడు శ్రీవిష్ణు.
హుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందబోయే క్రైమ్ థ్రిల్లర్ లో డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాడు. ఇప్పటికే అరవై శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీలో తనతో రెండోసారి ఈషా రెబ్బ మోనికా హీరోయిన్ గా జోడి కడుతోంది . అనౌన్స్ మెంట్ టీజర్ లో చూచాయగా కాన్సెప్ట్ ఏంటో చెప్పింది కానీ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఒక నేరానికి సంబంధించిన పరిశోధనలో శ్రీవిష్ణు నిమగ్నమైన విజువల్స్ ని మాత్రమే చూపించారు. ఆ మధ్య సీరియస్ గా శ్రీవిష్ణు ట్రై చేసిన భళా తందనాన, అల్లూరి, తిప్పరా మీసం లాంటివి ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.
అలా అని పూర్తిగా కామెడీకే కట్టుబడినా అల్లరి నరేష్ లాగా కెరీర్ రిస్క్ లో పడుతుంది. అందుకే అన్ని రకాలుగా ట్రై చేయడం ఉత్తమం. దీని కన్నా ముందు శ్రీవిష్ణు స్వాగ్ రిలీజవుతుంది. ఇది ఎంటర్ టైన్మెంట్ బ్యాచే. ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు ఎంచుకుంటున్న శ్రీవిష్ణు ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలు చేయడం వల్లే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి రెండు అంచనాలు అందుకోకపోయినా ఒక బ్లాక్ బస్టర్ లెక్కను సెటిల్ చేస్తుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అసలే పోటీ ఎక్కువగా ఉన్న ట్రెండ్ లో ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవడం అవసరమే.
This post was last modified on April 17, 2024 9:03 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…