Political News

కూటమి నేతలను సైతం వదలొద్దంటున్న పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు…మధ్య సమాజం పట్ల తనకున్న అవగాహన, సమాజం తీరుతెన్నులపై ఆయన స్పందించే తీరు తదితరాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు పవన్ సిసలైన వైఖరి ఏమిటన్న విషయం ఇప్పటికే తెలుగు ప్రజలకు తెలిసే ఉంటుంది.

ప్రజలకు తెలిసిన తనలోని సిసలైన వైఖరిని ఇప్పుడు పవన్ బయటపెట్టేశారు. దానినే తన పాటనలోనూ అమలు చేసే దిశగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టే విషయంలో మనోడైనా నిబంధనల మేరకు కట్టి తీరాల్సిందేనంటూ పవన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తోంది.

సోమవారం అమరావతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పన్ను రాయితీలు పొందిన సంస్థల గురించిన ప్రస్తావన రాగా… పవన్ ఆసక్తికర కామెంట్లు చేశారు.

“రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి వద్ద నుంచి ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేస్తున్నాం. మరి వందల కోట్ల రాబడిని అందుకుంటున్న సంస్థల నుంచి పన్ను రాబట్టలేకపోతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. నిబంధనల మేరకు అందరి నుంచి పన్ను రాబట్టాల్సిందే. ఈ తరహా పద్ధతిని ముందుగా మన ఎన్డీఏ, మన కూటమి పార్టీలకు చెందిన వారి నుంచే మొదలు పెడదాం. మనోళ్ల నుంచి పన్నులు రాబట్టి మన నిజాయతీని నిరూపించుకోవాలి కదా”… అంలూ పవన్ తనదైన శైలిలో చెప్పుకుపోయారు.

పంచాయతీలకు పన్నులు ఎగవేస్తున్న వాటిలో పరిశ్రమలు, విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా పవన్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నుంచి ఆయా ప్రైవేట్ విద్యా సంస్థలు క్రమం తప్పకుండా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు.. ఆయా స్కూళ్లు ప్రభుత్వానికి, పంచాయతీలకు కట్టాల్సిన ట్యాక్స్ ను సరైన సమయంలో ఎందుకు కట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఉద్యోగులతో పాటు మత్స్యకారులు కూడా ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తున్న నేఫథ్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు ఎగవేయడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంస్థలు పన్నులు కట్టకుండా ఉంటే… వారి వద్ద నుంచి పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు.

మొత్తంగా మార్పు దిశగా పవన్ దృష్టి సారించిన వైనం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పాలి. ఇటీవలే గోదావరి పుష్కరాల పరిశీలన సందర్భంగా పరిశ్రమలు తమ కాలుష్యాలను నదిలోకి ఎలా వదిలేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ తాజాగా ఆయా సంస్థల పన్ను వసూళ్లపైనా దృష్టి సారించడం గమనార్హ.

ఏదైనా ఓ మాట పవన్ నుంచి బయటకు వచ్చిందంటే… దానిని తప్పకుండా అమలు చేసే దిశగా సాగుతున్న పవన్… ఇప్పుడు పరిశ్రమలు. ప్రైవేట్ విద్యాలయాల నుంచి కూడా పన్నులు రాబడతారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో తన మన అన్న తేడా లేని విధంగా పవన్ వ్యవహరిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మరి పవన్ తీరును కూటమి పార్టీల నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి.

This post was last modified on June 1, 2026 1:53 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

4 hours ago