ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని టీడీపీ శ్రేణులలో ఆందోళన కలిగిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
అయితే తాజాగా చంద్రబాబు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని, ఆయన తనయుడు లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు రెడ్ డైరీ అంటూ హెచ్చరికలు చేశారని, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నామని హెచ్చరికలు చేశారని, అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తాం అని అన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ కోర్టులో పిటీషన్ వేసింది.
ఎన్నికలు మరో 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఐడీ పిటీషన్ కలకలం రేపుతున్నది. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందంటూ చంద్రబాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదించారు. దీంతో తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసిన సుప్రీం కోర్ట్. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దంటూ చంద్రబాబును ఆదేశించింది. ఈ పిటిషన్పై మే 7న సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతున్నది అని అంధరూ ఉత్కంఠగా ఉన్నారు.
This post was last modified on April 17, 2024 11:24 am
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…