ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని టీడీపీ శ్రేణులలో ఆందోళన కలిగిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
అయితే తాజాగా చంద్రబాబు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని, ఆయన తనయుడు లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు రెడ్ డైరీ అంటూ హెచ్చరికలు చేశారని, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నామని హెచ్చరికలు చేశారని, అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తాం అని అన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ కోర్టులో పిటీషన్ వేసింది.
ఎన్నికలు మరో 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఐడీ పిటీషన్ కలకలం రేపుతున్నది. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందంటూ చంద్రబాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదించారు. దీంతో తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసిన సుప్రీం కోర్ట్. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దంటూ చంద్రబాబును ఆదేశించింది. ఈ పిటిషన్పై మే 7న సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతున్నది అని అంధరూ ఉత్కంఠగా ఉన్నారు.
This post was last modified on April 17, 2024 11:24 am
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…